Breaking News

అఖండ భారత్‌ నినాదం దేశానికి ముప్పు 

Published on Tue, 08/23/2022 - 01:29

సాక్షి, యాదాద్రి: ప్రధాని మోదీ తెచ్చిన అఖండ భారత్‌ నినాదంతో దేశానికి పెనుముప్పు పొంచి ఉందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన పరిపాలన గాడితప్పిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పునాదులను పెకిలించి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడమే అఖండ భారత్‌ నినాదం వెనుక ఉన్న ముప్పు అని వివరించారు.

సోమవారం భువనగిరిలో సీపీఐ జిల్లా మహాసభల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అభ్యుదయ వాదులను, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ పేరిట ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేశారన్నారు. దేశంలో పేదలకు ఉచితాలు వద్దంటూ సంపన్నులకు రాయితీలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.

బడా కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. యూనివర్సిటీల్లో స్కాలర్‌ షిప్‌ తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోదీ ప్రభుత్వం విద్యకు దూరం చేస్తున్నదన్నారు. పార్లమెంట్‌లో విద్యుత్‌ సంస్కరణ బిల్లు ఆమోదం పొందగానే వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలవుతుందని సురవరం చెప్పారు.

పాలు, పెరుగు, చెప్పులు, తలకు రుద్దుకునే నూనెలకు సైతం జీఎస్టీ విధిస్తే పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..  బీజేపీ పాగా వేయకూడదనే మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. 

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)