Breaking News

నాదెండ్ల, నారా, పవన్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి రాజా

Published on Tue, 08/23/2022 - 15:59

సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు. ఈ మేరకు మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు జగన్‌ని వెన్నుపోటు పొడవాలని నారా, పవన్, నాదెండ్ల మనోహర్‌లు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా జగన్‌ని ఏమీ చేయలేరని అన్నారు.

'చిరంజీవి, జగన్ ఎంత ప్రేమ, ఆప్యాయతతో ఉంటారో నాకు తెలుసు. వైఎస్సార్‌సీపీ నుండి మేము అడుగుతున్నాం. చంద్రబాబు చెబితే తప్ప ఎన్ని సీట్లలో పోటీ చేస్తావో​ కూడా చెప్పలేవు. అన్ని సీట్లలో పోటీ చేసే దమ్ము లేదు. రాష్ట్ర ప్రజలు జగన్‌ ప్రభుత్వానికి అండగా నిలిచారు. 40కి పైగా పథకాలని ఆపాలని ఇప్పుడు పవన్‌ కోరుకుంటున్నారంటూ' మంత్రి దాడిశెట్టి రాజా చెప్పుకొచ్చారు.

చదవండి: (డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి)

పవన్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు
అయితే పవన్‌ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడని మండిపడ్డారు. ఆయనే పెద్ద పుడింగి అయితే అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఎందుకు కలుస్తాడని ప్రశించారు. పవన్‌ కల్యాణ్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంతో మాట్లాడి నిజాలు నిగ్గుతేల్చు
కాపులకు ఆరాధ్య దైవం అయిన వంగవీటి రంగా హత్య కేసుతో టీడీపీకి సంబంధం లేదని పవన్‌ నిరూపించాలని కోరారు. ఆ కేసు గురించి కేంద్రంతో మాట్లాడి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. కాపు నేతల్ని, మహిళలను పోలీసులతో కొట్టించినపుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. కాపులకు ఇంత అన్యాయం చేసిన చంద్రబాబుని ముందు ప్రశ్నించాలని' పవన్‌ కల్యాణ్‌కు మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)