Breaking News

ఈ నెల 12న ప్రధాని మోదీ సభ దద్ధరిల్లాలి: బండి సంజయ్

Published on Sun, 11/06/2022 - 02:07

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా రామగుండంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. భారీగా జనసమీకరణ చేసి మోదీ సభను విజయవంతం చేయాలని భావిస్తోంది. శనివారం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నేతలతో మోదీ పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ ‘మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ సభకు పెద్దసంఖ్యలో రైతులను తరలించాలి. జన సమీకరణ, సభ విజయవంతానికి జిల్లాల నాయకులు సమన్వయంతో పనిచేయాలి. అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలి. ముఖ్యంగా రూ.6,120 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడంవల్ల రైతులకు కలిగే ప్రయోజాలను వివరించాలి’అని నాయకులకు ఆదేశించారు.

మో­దీ ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదని ప్రజలకు చెప్పాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఆ భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో ఏటా వేలాది కోట్లు ఖర్చు పెట్టి సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు సోయం బాపూరావు, ఈటల రాజేందర్, జి.వివేక్, జి.విజయరామారావు, సుద్దాల దేవయ్య, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, ప్రదీప్‌ కుమార్, ఎస్‌.కుమార్,  మనోహర్‌ రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.  

మునుగోడులో గెలుస్తాం: బండి 
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నిక సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఒక ఉపఎన్నిక సీటు గెలిచేందుకు రూ.వేయి కోట్లకు పైగా ఖర్చు చేశారని, మద్యం ఏరులై పారించారని మండిపడ్డారు.

12న ప్రధాని మోదీ రామగుండం సభ ఏర్పాట్లపై శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మునుగోడు అంశం ప్రస్తావనకు రాగా సంజయ్‌ పై విధంగా స్పందించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీస్‌ కమిషనర్, జిల్లా ఎస్పీ టీఆర్‌ఎస్‌ తొత్తులుగా మారారని ఆరోపించారు. ‘ఏడేళ్లుగా ఒకే పోస్టింగ్‌లో ఉన్న పోలీస్‌ కమిషనర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా పనిచేశారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి కేసులు నమోదు చేశారు. ఇన్ని చేసినా ప్రజలు మనవైపే ఉన్నారు’అని సంజయ్‌ తెలిపారు.
చదవండి: జాతీయ బరిలో  బీఆర్‌ఎస్‌.. ‘ఫామ్‌హౌస్‌’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)