Breaking News

జార్ఖండ్‌ పోలింగ్‌: 65 శాతం ఓటింగ్‌ నమోదు

Published on Wed, 11/13/2024 - 06:39

Updates

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది.  సాయంత్రం 5 గంటల వరకు 64.86 శాతం పోలింగ్‌ నమోదు

     మధ్యా హ్నం 3 గంటల వరకు 59.28 శాతం పోలింగ్‌ నమోదు

  • భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రాంచీలోని పోలింగ్‌ బూత్‌లో సతీమణి సాక్షితో కలిసి ఓటు వేశారు.

    మధ్యాహ్నం 1 గంట వరకు 46% పోలింగ్‌ నమోదైంది.

     బీజేపీ నేత జయంత్ సిన్హా హజారీబాగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

 

  • జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి సోనాపిలోని ప్రాథమిక విద్యాలయం వద్ద ఓటర్లు నక్సల్స్ బెదిరింపులను ధిక్కరించి భారీ సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చారు. 
  • నక్సలైట్లు.. పోస్టర్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
  • భద్రతా బలగాలు పోస్టర్లు, అడ్డంకులను విజయవంతంగా తొలగించాయి. 
  • జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి, జగన్నాథ్‌పూర్ పోలింగ్ బూత్ నంబర్ 25లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.

     

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది
  • ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం ఓటింగ్ నమోదైంది

 

  • జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

 

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.  
  • ఉదయం 9 గంటల వరకు 13.04 శాతం ఓటింగ్ నమోదు

  • మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు అర్జున్ ముండా, ఆయన భార్య మీరా ముండా ఓటు శారు.
  • సెరైకెలా ఖర్సావాన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
  • పొత్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మీరాముండా బరిలో ఉన్నారు.

 

  • జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ఒడిశా గవర్నర్ , జార్ఖండ్ మాజీ సిఎం రఘుబర్ దాస్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.​
  • జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటువేశారు.

 

  • కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు హకక్కు వినియోగించుకున్నారు.
  • కోడెర్మాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
  • జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.

 

  • రాంచీలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.
  • పోలీసులు డ్రోన్‌లను ఉపయోగించి నిఘా పెట్టారు.

 

 

  • హజారీబాగ్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మున్నా సింగ్ ఓటు వేశారు.
  • హజారీబాగ్‌లో అభివృద్ధి, శ్రేయస్సు తీసుకురావడానికి ఓటు వేయాలని హజారీబాగ్ ఓటర్లందరినీ అభ్యర్థించారు.

 

పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండి: ప్రధాని మోదీ

  • జార్ఖండ్ తొలి దశ పోలింగ్‌లో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓరట్లను కోరారు. 
  • తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు క్యూలైన్లలో ఉన్నారు. 

 

  • జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • జంషెడ్‌పూర్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అజోయ్ కుమార్ ఓటు వేశారు. 
  • జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ ఓటు వేశారు.

     

  • జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • జంషెడ్‌పూర్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ నేత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • సరయూ రాయ్ జంషెడ్‌పూర్ వెస్ట్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
  • ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బన్నా గుప్తా పోటీ చేస్తున్నారు.

     

     

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

 

 

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోలింగ్‌ కొనసాగుతోంది.
  • రాంచీలోని జవహర్ నగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ప్రజలు  పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలైన్‌లో ఉన్నారు.

 

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • రాంచీలోని పోలింగ్ బూత్ నంబర్లు 50,60, 61 పోలింగ్‌ జరుగుతోంది.
  • ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లతో నిల్చున్నారు.
  • ఈ సందర్భంగా ఓ మహిళ సంప్రదాయ డోలు వాయిస్తూ ప్రజలను ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు.

 

 

  • జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు.

 

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది.
  • ఈ దశలో 81 స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
  • జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటుర్లు  ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

 

 

 

  • జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది.

 

 

 

  • పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు.
  • తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. 
  • సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. 

 

  • తొలిదశ పోలింగ్‌ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్‌ స్థానాలున్నాయి. 
  • మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్‌ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ ఇవాళే పోలింగ్‌ జరునుంది.
  • కాంగ్రెస్‌ నేత అజయ్‌కుమార్‌ జంషెడ్‌పూర్‌ ఈస్ట్‌ నుంచి బరిలో దిగారు
  • ఇక్కడ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. 
  • జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. 
  • ఇక్కడ కాంగ్రెస్‌ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
  •  జంషెడ్‌పూర్‌ వెస్ట్‌ నుంచి కాంగ్రెస్‌ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. 
  • ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్‌ బరిలోకి దిగారు. 
  • సరయూరాయ్‌ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. 
  • రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది.

 

  • తొలి దశలో పోలింగ్‌ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలున్నాయి!
  • బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్‌ కేసులుంటే వాటిని రెడ్‌ అలర్ట్‌ స్థానాలుగా పరిగణిస్తారు. 
  • ఇక 174 (26%) మందిపై క్రిమినల్‌ కేసులున్నట్టు జార్ఖండ్‌ ఎలక్షన్‌ వాచ్, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించాయి.
  • వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. 
  • బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి.
  • 11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. 
  • అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. 
  • బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. 
     

 

 

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)