Breaking News

జైల్లో పెడితే మా పార్టీ నేతలు భయపడరు: అమర్‌నాథ్‌

Published on Tue, 02/17/2026 - 13:59

సాక్షి, తూర్పుగోదావరి: అంబటి ఇంటిపై జరిగిన దాడి.. కక్ష పూరిత రాజకీయ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాంబాబును హతమార్చాలని జరిగిన దాడిలో బాధితులను జైల్లో పెట్టారు.. దాడికి పాల్పడినవారు ప్రేరేపించినవారు.. బయట తిరుగుతున్నారు... ఇది రాష్ట్రంలో రాజ్యాంగం’’ అంటూ మండిపడ్డారు.

‘‘రాష్ట్రంలో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పబ్లిసిటీ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ మాత్రమే రాష్ట్రంలో చేస్తున్నారు. బడ్జెట్‌లో కనీస అవగాహన ఉన్న కూర్పు కూడా లేదు. రాష్ట్ర చరిత్రలో దారుణమైన బడ్జెట్ ఇదే.. అప్పు మాత్రమే కనబడుతుంది. అప్పు తీసుకొచ్చిన సొమ్ము ఏమయిపోయిందో చంద్రబాబుకు, లోకేష్‌కు తప్ప ఎవరికి తెలియదు’’ అంటూ అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

‘‘గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో రెండు లక్షల 70 వేల కోట్లు డీబీటి కింద పేదల అకౌంట్‌లో వేశారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి చంద్రబాబు వివరణ ఇవ్వాలి. సరాసరిన రోజుకు 500 కోట్లు  ప్రభుత్వం అప్పు చేస్తుంది. ఏ ఒక్క రంగానికి సరైన కేటాయింపులు లేవు. యూరియా కోసం రైతుల రోడ్లమీద కొట్టుకుంటున్నారు. 6000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.  అన్నదాత సుఖీభవ, పేదలకు మూడు సిలిండర్లు వంటి ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కాలేదు.

ఒక్క పథకం అమలు చేయకుండా అంబటి వంటి నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్ రెడ్‌బుక్‌ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు బిల్ గేట్స్‌ని కాదు కదా ఎవరు తీసుకొచ్చినా ఏమంటుంది?.  జైల్లో పెడితే మా పార్టీ నేతలు భయపడరు’’ అని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

పులిని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య పెట్టారు జాగ్రత్త

ఏపీలో దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది: కరణం ధర్మశ్రీ
రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది. చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. కేవలం తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించేందుకే అంబటి రాంబాబును జైలు పాలు చేశారు. బడ్జెట్ బుక్ అంతా వట్టి డొల్ల. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో సమాధి కడతారు

Videos

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)