Breaking News

ధనవంతులకు బీజేపీ.. నేరస్తులకు ఆప్‌.. టిక్కెట్ల లెక్కలివే

Published on Tue, 01/28/2025 - 07:33

న్యూఢిల్లీ: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ నాల్గవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌), ఢిల్లీ ఎలక్షన్ వాచ్‌లు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 699 మంది అభ్యర్థులకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేశాయి.

పార్టీల పరంగా చూస్తే నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికంగా టిక్కెట్లు కేటాయించింది. దీని తరువాత ఇటువంటి జాబితాలో కాంగ్రెస్, బీజేపీలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 46 శాతం మంది 5 నుండి 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 29 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. మొత్తం 132 మంది అభ్యర్థులు (19శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నారు. 81 మంది అభ్యర్థులు (12శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులలో ఐదు శాతం మంది అత్యంత ధనవంతులు. వీరిలో బీజేపీకి చెందినవారు ముగ్గురున్నారు. కాంగ్రెస్ ఒక కోటీశ్వరునికి టికెట్ ఇచ్చింది. ఆప్ కూడా ఎన్నికల బరిలో ఒక బిలియనీర్‌ను నిలబెట్టింది. బీజేపీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ అత్యంత ధనవంతుడు. అతని ఆస్తుల విలువ 2019లో రూ. 3.2 కోట్లు ఉండగా, అది నుండి 2025 నాటికి 96.5 కోట్లకు పెరిగిందని అతను సమర్పించిన అఫిడవిట్‌ ద్వారా వెల్లడయ్యింది. 

ఇది కూడా చదవండి: ఎవరెస్ట్‌ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)