Breaking News

సీఎం జగన్‌ సెటైర్లు.. 'పచ్చళ్లు అమ్మినా అది మావారే అయ్యుండాలి'

Published on Thu, 09/15/2022 - 19:03

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం పరిపాలన వికేంద్రీకరణ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ఆయన బృందం ఆలోచనలు ఎలా ఉంటాయో సభ ద్వారా ప్రజలకు తెలియజేశారు. 

'ఈ పెత్తందారీల మనస్థత్వాలను పరిశీలిస్తే.. మా బినామీ భూముల ప్రాంతాలు మాత్రమే రాజధానిగా ఉండాలి. ఇంకెక్కడా ఉండకూడదు. పత్రిక అంటూ ఉంటే అది కేవలం ఈనాడు, మా చంద్రజ్యోతి మాత్రమే. మరే పత్రికా ఉండకూడదు. పచ్చళ్లు అమ్మినా కూడా అది మావారి పచ్చళ్లే అమ్మాలి. చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేసినా కూడా మావారిదే జరగాలి. మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి కూడా ఏమైనా చేయొచ్చ. డైరీలు, పాలు అంటే ప్రభుత్వ రంగంలో లాభాల్లో ఉన్న చిత్తూరు డైరీని కూడా మూసేయాలి. మా హెరిటేజ్‌ కోసం ఆ డైరీల గొంతు నొక్కాలి.

ఆ రంగం, ఈ రంగం.. వాళ్లు, వీళ్లూ అనే తేడాలేదు. ఎవ్వరూ కూడా మార్కెట్‌లో ఉండకూడదు. ఏ ఇండస్ట్రీలో అయినా ఉంటే నేను నా మనుషులు మాత్రమే ఉండాలి. కార్పొరేట్‌ చదువులు తీసుకుంటే కూడా కేవలం మా నారాయణ, మా చైతన్య మాత్రమే ఉండాలి. గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం కూడా ఉండకూడదు. అన్ని వ్యవస్థలు కూడా మన మనుసుల చేతుల్లోనే ఉండాలి. అన్ని ప్రతిపక్ష పార్టీల్లో కూడా నా మనుషులే ఉండాలనేది ఈ పెత్తందారీల మనస్థత్వం' అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఒక్క రాజధాని విషయంలోనే కాదు.. ఏ విషయం తీసుకున్నా కూడా వీళ్ల ఆలోచనలు, డిజైన్లు ఇదే విధంగా ఉంటాయని సీఎం జగన్‌ మండిపడ్డారు.

చదవండి: (కట్టని రాజధాని గురించి ఉద్యమాలా?: సీఎం జగన్‌)

Videos

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)