Breaking News

Delhi: కేజ్రీవాల్‌ ఛాలెంజ్‌.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద హైటెన్షన్‌

Published on Sun, 05/19/2024 - 10:17

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  తమ పార్టీ నేతలను  అందరినీ ఒకేసారి అరెస్ట్‌ చేసి జైలుకు పంపాలని సవాల్‌ చేశారు. ఇవాళ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి నిరసన మార్చ్‌ చేపట్టనున్నారు సీఎం కేజ్రీవాల్‌. దీంతో ఢిల్లీలోని  బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్‌ నెలకొంది. 

తమ పార్టీ నేతలను అరెస్ట్‌లతో బీజేపీ టార్గెట్‌ చేయడాన్ని తప్పుపట్టిన కేజ్రీవాల్‌  ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని కావాలనుకుంటే అందరినీ ఒకేసారి అరెస్ట్‌ చేయాలని ఛాలెంజ్‌ చేశారు. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ వీడియోలో సందేశం ద్వారా పార్టీ నేతలకు నిరసన, మార్చ్‌కు పిలుపు నిచ్చారు.

‘‘మా నేతలను ఒకరి తర్వాత ఒకరిని జైలులో పెడుతున్నారు. ప్రధాని మోదీకి నేను ఒకటి చెప్పదల్చుకున్నా. అరెస్ట్‌లను ఒక క్రీడా భావిస్తున్నారు. మా నేతలనంతా ఒకేసారి అరెస్ట్‌ చేయండి. అందుకే  నేను,  మా పార్టీ  సీనియర్‌ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తీసుకొని ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తాం. అప్పుడు మమల్ని ఒకేసారి జైలులో వేయండి’’ అని కేజ్రీవాల్‌ శనివారం ఓ వీడియో విడుదల చేశారు.

తమ పార్టీలో కీలకమైన నేతలను బీజేపీ టార్గెట్‌ చేస్తోందని మండిపడ్డారు. వారిలో రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా, మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిశీ ఉన్నారని కేజ్రీవాల్‌  తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఎ బిభవ్‌ కుమార్‌ తనపై ముఖ్యమంత్రి నివాసంలో దాడి చేశారని ఆరోపణలు చేయటం ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. బిభవ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. శనివారం బిభవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ తనతో అమర్యాదగా ప్రవర్తించారని బిభవ్‌ కుమార్ సైతం ఆమెపై కేసు నమోదు చేశారు.

స్వాతి మలివాల్‌పై అవినీతి అరోపణ కేసు ఉండటంలో బీజేపీ  కుట్రతోనే తనపై దాడి జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆప్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

మరోవైపు.. స్వాతి మలివాల్‌ ఘటన విషయంలో బీజేపీ నేతలు సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్నారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మౌనంగా  ఉంటున్నారని మండిపడుతున్నారు. సీఎం కేజ్రీవాల్‌ పెదవి విప్పకపోవటంపై  ఈ దాడి వెనక ఆయన హస్తం ఉందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)