Breaking News

ఆసక్తికరంగా కేజ్రీవాల్‌ బెంగళూరు పర్యటన

Published on Mon, 04/18/2022 - 19:21

బెంగళూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. బెంగళూరు పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఏప్రిల్ 21న నేషనల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే రైతు సమ్మేళనానికి ఆయన హాజరుకానున్నారు. కర్ణాటక రాజ్య రైతు సంఘం అధినేత, రైతు నాయకుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌ ఆహ్వానం మేరకు ఇక్కడకు వస్తున్నారు. 

ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీగా ప్రఖ్యాతిగాంచిన బెంగళూరులో తమ గళాన్ని వినిపించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టు కనబడుతోంది. బెంగళూరు వేదికగా కర్ణాటక ప్రజలకు కేజ్రీవాల్‌ ‘న్యూ ఏజ్ పాలిటిక్స్’ సందేశం ఇస్తారని ఆప్‌ నేతలు చెబుతున్నారు. పార్టీలోకి చేరికలు కూడా ఉంటాయని వారు వెల్లడించారు. 

కర్ణాటక ఆప్ కన్వీనర్ పృథ్వి రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కోసం పోరాడే వారికి ఆప్ వేదిక అని, అలాంటి వారిని విధానసౌధకు ఎన్నుకోవడం వల్ల రైతాంగ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ‘ఇది చారిత్రాత్మకమైన రోజు అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని రైతులు వివిధ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీలు రైతులను మోసం చేస్తూ వచ్చాయి. కర్ణాటక రైతులు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుని సమస్యల పరిష్కారానికి ఆప్ మాత్రమే కృషి చేస్తుందని వారు భావిస్తున్నార’ని పృథ్వీ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆప్ ద్వారా సామాన్య ప్రజలు సృష్టించిన ‘విప్లవాన్ని’ కర్ణాటకలో ఎలా పునరావృతం చేయవచ్చనే దానిపై బెంగళూరులో కేజ్రీవాల్‌ ప్రసంగిస్తారని చెప్పారు. 

కేజ్రీవాల్‌ ప్రసంగాన్ని వినేందుకు యువత, ప్రగతిశీల ఆలోచనాపరులు ఎదురుచూస్తున్నారని ఇటీవల ఆప్‌లో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి భాస్కర్‌రావు తెలిపారు. డబ్బు, కండబలం, కులాలకు భిన్నమైన 'న్యూ ఏజ్‌ పాలిటిక్స్‌'కు రాష్ట్రం సిద్ధమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ నిజాయితీ, అవినీతి రహిత పరిపాలనను అందిస్తోందని.. అలాంటి ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి కూడా అవసరం అన్నారాయన. (క్లిక్‌: కాంగ్రెస్‌ చీఫ్‌కు ‘ఆప్‌’ భారీ ఆఫర్‌.. రెస్పాన్స్‌పై ఫుల్‌ టెన్షన్‌!)

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)