Breaking News

రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే!

Published on Mon, 06/13/2022 - 14:35

సాక్షి, తాడేపల్లి: పచ్చి అబద్ధాలతో పచ్చ రాతలు రాస్తూ అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితమైందని అన్నారు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌. సోమవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఈనాడు అధినేత రామోజీరావుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్‌. అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితం అయ్యిందని, రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ‘‘పేదలకు ఇళ్లు కట్టించాలన్న సంకల్పంతో సీఎం జగన్‌ ప్రభుత్వం పని చేస్తోంది. కానీ, ఈ ప్రభుత్వంపై దిగజారుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు తన హయాంలో స్థలం ఇవ్వలేదు.. ఇల్లూ కట్టలేదు. 14 ఏళ్ల పాలనలో ఏమీ చేయని చంద్రబాబుకు రామోజీరావు వంతపాడుతున్నారు.  ఇప్పుడేమో సీఎం జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. 

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్న మంత్రి జోగి రమేష్‌.. జరుగుతున్న వాస్తవాలను రామోజీరావు చూడలేకపోతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఊరికొక ఇంటిని కట్టారు.కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. పేదలకు ఇళ్లు కడుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉందని మండిపడ్డారు. తప్పుడు కథనాలపై చర్చకు సిద్ధమా అంటూ రామోజీరావుకు సవాల్‌ విసిరారు మంత్రి జోగి రమేష్‌.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)