Breaking News

జిన్‌పింగ్‌..ముర్ము..మోదీ !

Published on Fri, 08/29/2025 - 02:47

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల కొరడా ఝళిపిస్తున్న వేళ ఓ లేఖ భారత్‌–చైనాల సంబంధాలను మలుపుతిప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఓ లేఖ రాశారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలనే ఆకాంక్షను ఆయన అందులో వ్యక్తం చేశారు. లేఖను రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి అందజేశారు. భారత్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తమకు ఈ విషయం తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ తాజా కథనంలో పేర్కొంది. అమెరికాతో కుదుర్చుకున్న ఎలాంటి ఒప్పందమైనా అది అంతిమంగా చైనా ప్రయోజనాలకు హానికల్గిస్తుందని జిన్‌పింగ్‌ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.

 ద్రౌపదీ ముర్ముకు మార్చిలో జిన్‌పింగ్‌ ఒక లేఖ రాసినట్లు రెండు దేశాల మీడియాల్లోనూ వచి్చంది. అయితే, ఆ లేఖ ఇదేనా అనే విషయం స్పష్టం కాలేదు. అనంతర పరిణామాల్లో రెండు దేశాలు తమ మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు పలు చర్యలను ప్రకటించాయి. కైలాస్‌–మానస సరోవర్‌ యాత్ర మార్గాన్ని భారత తీర్థయాత్రికుల కోసం చైనా తెరవగా చైనా పర్యాటకుల కోసం భారత్‌ వీసాల జారీని ప్రారంభించింది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలు సైతం మొదలయ్యాయి. మార్చిలో జిన్‌పింగ్‌ రాసిన లేఖ తర్వాత,  ట్రంప్‌ టారిఫ్‌ల బాదుడు మొదలుకాక మునుపే భారత్, చైనాల మధ్య దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు మొదలైనట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం విశ్లేషించింది. మరోవైపు, ట్రంప్‌ టారిఫ్‌ల విధానం అమెరికా–భారత్‌ మధ్య అంతరాన్ని పెంచింది. 

దీనికితోడు భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరగాల్సిన అణుయుద్ధం తన జోక్యంతోనే ఆగిందంటూ ట్రంప్‌ పదేపదే చెప్పుకోవడాన్ని భారత్‌కు అస్సలు రుచించలేదు. అప్పటి వరకు చైనాకు దగ్గరయ్యే విషయాన్ని అంత సీరియస్‌గా ఆలోచించని భారత్‌ జూన్‌ తర్వాతే చైనాతో సంబంధాల మెరుగుపై దృష్టిపెట్టిందని బ్లూమ్‌బర్గ్‌ కథనం విశ్లేషించింది. గతేడాది లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైన్యాలను పాక్షికంగా ఉపసంహరించుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి రావడం కూడా చైనాపై సానుకూలంగా ఆలోచించేందుకు దారి చూపిందని తెలిపింది. 

ఇదే త్వరలో చైనాలో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్రం సందర్భంగా జిన్‌పింగ్, మోదీల ముఖాముఖీకి మార్గ సుగమం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌ కంటే ముందుగా చైనాపైనే ట్రంప్‌ 145 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. అయితే, ఆ దేశంతో అమెరికా వైఖరి మరోలా ఉంది. టారిఫ్‌లకు తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా ప్రస్తుతం ఆ దేశంతో వాణిజ్య చర్చలు జరుపుతోంది. కీలక ఖనిజాల సరఫరా వంటివి చైనా చేతుల్లో ఉండటంతో ట్రంప్‌ ఆ దేశంతో జాగ్రత్తగా డీల్‌ చేస్తున్నారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)