Breaking News

వేద మంత్రోచ్ఛారణల మధ్య కొలువు దీరిన అతిపెద్ద సహస్ర లింగం

Published on Sat, 01/17/2026 - 18:55

పట్నా: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కొలువుదీరింది బిహార్‌లోని  కేసరియాలోని విరాట్ రామాయణ మందిర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద 210 టన్నుల శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. 33 ఫీట్ల ఎత్తు, 210 టన్నుల బరువు ఉన్న ఆ శివలింగాన్ని తమిళనాడులో తయారు చేశారు. కొన్ని వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆ శివలింగం బిహార్‌కు చేరుకుంది.  

ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా  ఈ ఆలయం ఘనతను సాధించింది.  ఈ సహస్రలింగం శివలింగ ప్రతిష్టాపనలో కార్యక్రమంలో పలువురు పండితులు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, , ఉపముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, పలువురు ఇతర నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఈ పవిత్ర శివలింగాన్ని 17 అడుగుల మాలతో అ లంకరించడం విశేషం. సహస్రలింగం శివలింగంతో పాటు, విరాట్ రామాయణ ఆలయంలో 1072 దేవతలను కూడా ప్రతిష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగాన్ని దాదాపు 10 ఏళ్లుగా తమిళనాడులో ప్రత్యేకంగా రూపొందించారు.

20 కిలోల పూలమాల, 3250 కిలోల పువ్వులు

శివలింగ ప్రతిష్ఠాపనలో పువ్వులు, మారేడు ఆకులు, ఉమ్మెత్తతో చేసిన 20 కిలోల పూలమాలను పూజాదికాలతో శివలింగానికి సమర్పించగా, ఆలయ అలంకరణ కోసం 3250 కిలోల పువ్వులను ఉపయోగించారు. ఈ పువ్వులను కోల్‌కతా, కంబోడియా నుండి తీసుకువచ్చారు. శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన  21 మంది పూజారులు పూజలు నిర్వహించగా, వేదమంత్రోచ్ఛారణల మధ్య 1072 దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠాపన తర్వాత, నేల నుండి దీని ఎత్తు 56 అడుగులు ఉంటుంది. ఈ భారీ శివలింగాన్ని 96 చక్రాల ట్రక్కును ఉపయోగించి 45 రోజుల్లో తమిళనాడులోని మహా బలిపురం నుండి కైత్వాలియాకు తరలించారు.

రూ. 3 కోట్లు 
సహస్రలింగం శివలింగంలో 1008 చిన్న శివలింగాలు ఉన్నాయి, ఇది నల్ల గ్రానైట్ రాయితో తయారు చేయబడింది. అందుకే దీనికి సహస్రలింగం (అంటే "వెయ్యి శివలింగాలు") అని పేరు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మహావీర్ మందిర్ ట్రస్ట్ కమిటీ విరాట్ రామాయణ ఆలయాన్ని నిర్మిస్తోంది. పాట్నా హనుమాన్ ఆలయానికి చెందిన ఆచార్య కిషోర్ కునాల్ ఈ భారీ శివలింగం నిర్మాణాన్ని సంకల్పించారు ,ఇప్పుడు దాని ప్రతిష్ఠాపనతో ఆయన కల సాకారమైంది.

డీజీపీ స్పందన
ఈ కార్యక్రమం విజయవంతంపై  రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ, "పూర్తి భద్రతా ఏర్పాట్లతో  ఈ పుణ్యకార్యాన్ని పూర్తి చేసినట్టు  చెప్పారు. ఈ ఆలయం రాబోయే రోజుల్లో బిహార్‌లో మాత్రమే కాకుండా, ప్రపంచానికి ఒక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందుతుందని, ఈ సందర్భంగా కిషోర్ కునాల్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)