Breaking News

సంక్షోభానికి..  సత్వర  ముగింపు 

Published on Sat, 09/20/2025 - 05:36

న్యూఢిల్లీ: ఒక సంక్షోభానికి సాధ్యమైనంత అతి తక్కువ సమయంలో ముగింపు పలకడం ప్రపంచ దేశాలు భారత్‌ను చూసి నేర్చుకోవాల్సి ఉందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌ తన లక్ష్యాలను అత్యంత కచి్చతత్వంతో నిర్ధారించుకుందన్నారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో మిలటరీకి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు. 

దేశ రాజకీయ నాయకత్వం ఎలాంటి ఆంక్షలను విధించలేదని స్పష్టం చేశారు. మే 7–10వ తేదీల మధ్య పాకిస్తాన్‌తో కొనసాగిన సంక్షోభం సమయంలో వైమానిక దళం సత్తా చాటిందని పేర్కొన్నారు. ఎస్‌–400 క్షిపణి వ్యవస్థ సంక్షోభం గతినే మార్చేసిందని, ఈ ఆయుధ వ్యవస్థల శక్తిసామర్థ్యాలతో శత్రువు గుండెల్లో రైళ్లు పరుగెట్టాయన్నారు. శత్రువు సైనిక స్థావరాలు, మౌలిక వసతులు, రాడార్లు, కంట్రోల్‌ కోఆర్డినేషన్‌ వ్యవస్థలు, హంగార్లు, విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఎయిర్‌ చీఫ్‌ వివరించారు.

 ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు దీర్ఘకాలం కొనసాగాయంటూ ఆయన.. సంఘర్షణకు సరైన ముగింపు కూడా ఆపరేషన్‌లో ఒక ముఖ్యమైన అంశమేనన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ను మరింత కాలం కొనసాగిస్తే బాగుండేదన్న వాదనలను ఆయన కొట్టి పారేశారు. ‘ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ అది. మనం చాలా తొందరగా యుద్ధాన్ని ముగించాం. చేయాలనుకున్నది చేసేశాం. శత్రువు అప్పటికే కాళ్ల బేరానికొచ్చింది.

 ఇంకెందుకు ఈ సంక్షోభాన్ని కొనసాగించాలి? యుద్ధం వల్ల ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కూడా’అని ఆయన వివరించారు. మన ఆర్థిక వ్యవస్థతోపాటు దేశ పురోగతిపై పై ప్రభావం చూపుతుంది. ఆపరేషన్‌ పొడిగింపు వల్ల తర్వాతి చర్యలకు సన్నద్ధమయ్యే అవకాశం మనకుండదని తెలిపారు. అందుకే, సాధ్యమైనంత త్వరగా సంక్షోభాన్ని ప్రారంభించడం, ముగింపు పలకడం అనే అంశాల్లో ప్రపంచ దేశాలు భారత్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ సింగ్‌ అన్నారు.  
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)