Breaking News

మంచంపై పులిరాజా.. ఓ చేదు నిజం!

Published on Tue, 12/30/2025 - 14:51

గ్రామంలోకి చొరబడిన ఓ పెద్దపులి.. జనాలను బెంబేలెత్తించింది. ఓ వ్యక్తిపై దాడి చేశాక.. ఆరుబయట ఉన్న మంచంపై తీరికగా సేద తీరింది. ఆ దృశ్యాన్ని కొందరు ఫోన్లలో బంధించడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ ఘటన వెనుక ఉన్న​ చేదు నిజం గురించి చర్చ మాత్రం జరగడం లేదన్న అభిప్రాయం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.    

మధ్యప్రదేశ్‌ బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(Bandhavgarh Tiger Reserve) ప్రాంతంలో గ్రామంలోకి చొరబడింది. అక్కడ ఆరుబయట సంచరిస్తుండగా దానిపై రాళ్లతో దాడి చేశారు. భయంభయంగానే అది దాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అది అక్కడే కట్టేసిన ఉన్న పశువుల జోలికి పోలేదు(గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు). అయితే రాళ్లు తగిలిన కోపంతో.. ఓ గ్రామస్తుడ్ని నేలకేసి కొట్టింది. ఆపై మరో ఇంట్లోకి వెళ్లి కొన్ని గంటలపాటు మంచంపై కూర్చుని సేదదీరింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. పులి బోనులోకి చేరడంతో పాటు గాయపడిన వ్యక్తికి కూడా ప్రాణాపాయం తప్పడంతో.. ఆ ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అయితే.. వేటగాళ్లకు భయపడే పులులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆ ఊరి ప్రజలు చెబుతుండడం ఇక్కడ చర్చించాల్సిన విషయం. టైగర్‌ స్టేట్‌గా పేరొందిన మధ్యప్రదేశ్‌లో పెద్దపులుల మరణాల లెక్కలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా.. సగర్‌ జిల్లాలోని ధానా ఫారెస్ట్‌ రేంజ్‌లో 10 ఏళ్ల ఆడ పులి మృతదేహం దొరికింది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఆరు పులులు మృత్యువాత పడగా.. ఈ ఒక్క ఏడాదిలోనే 55 పులులు మరణించడం గమనార్హం. 

1973లో మధ్యప్రదేశ్‌లో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పులులు అత్యధికంగా చనిపోయింది ఈ ఏడాదిలోనే. అందునా అసహజ మరణాలే 11 నమోదు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే.. అటవీ శాఖ వీటిని ఎక్కువగా పులుల మధ్య గొడవలుగా పేర్కొంటున్నాయి.  కానీ, క్షేత్ర పరిస్థితులు అవి కావనే చెబుతున్నాయి. వేట, కరెంట్‌ ఉచ్చులు.. పర్యవేక్షణ లోపాలు, నిర్లక్ష్యం ప్రధాన కారణాలని తెలుస్తోంది. 

ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన అటవీ శాఖ నివేదికలో.. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, సరైన ఫోరెన్సిక్ పరిశీలన లేకపోవడం బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా నెట్వర్క్ ప్రధాన సూత్రధారి యాంగ్‌చెన్ లఖుంపా ఇటీవలె సిక్కిం బార్డర్‌లో అరెస్టు అయ్యాడు. మధ్యప్రదేశ్‌లో పులులను చంపి.. వాటి చర్మం, గోళ్లు పళ్లు.. అక్రమ రవాణా చేసిన అభియోగాలు అతనిపై ఉన్నాయి. 

సంరక్షణవాదులు(Conservationists) వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, సంస్కరణలు లేకపోతే మరణాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. మద్యప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం.. ప్రతి పులి మరణాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, నిపుణుల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని ఒక్క మాటతో తేల్చేస్తోంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు