Breaking News

ముంబై ఓటమి తర్వాత ఠాక్రేల స్పందన.. ఏమన్నారంటే?

Published on Sat, 01/17/2026 - 15:08

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. అధికార మహాయుతి కూటమి  పురపాలక సంస్థ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్లకు పైగా ముంబైని శాసించిన ఠాక్రే కుటుంబానికి ఈ సారి ముంబై పీఠం కోల్పోవాల్సి వచ్చింది. అయితే దీనిపై శివసేన (ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పదవిలో లేకపోయినా మరాఠా ప్రజలకు శివసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.

దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించింది. మరాఠా సంస్కృతి, భాష స్థానికతే ప్రధాన ఎజెండాగా ఆ పార్టీ రాజకీయాలు జరిపింది. అయితే ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహించిన శివసేన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తిరుగులేని అధిపత్యాన్ని కనబరిచేది. గత 25 ఏళ్లుగా ముంబై మేయర్‌ పీఠం శివసేన( ఠాక్రే) వర్గానిదే అంటే ఆ ప్రాంతంలో ఠాక్రేలు ఎంత ప్రభావం చూపగలరో చెప్పవచ్చు. అయితే నిన్న( శుక్రవారం) జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి స్పష్టమైన అధిపత్యం కనబరిచి ముంబై పీఠం కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే సోదరులు ఓటమి  తర్వాత తొలిసారిగా స్పందించారు. దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రేతో ఫోటోతో కూడిన లేఖను ఉద్దవ్ ఠాక్రే పోస్టే చేశారు." చేసే పోరాటం ముగియలేదు. మరాఠీలకు వారు కోరుకున్న విధంగా గౌరవం లభించేంత వరకూ ఇది ముగియదు" అని అన్నారు. 

ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌ ఠాక్రే స్పందిస్తూ "ప్రస్తుతం అధికారంలో ఉన్న శక్తులు మరాఠా ప్రజలను వేదించడానికి లభించే ఒక్క అవకాశాన్ని కూడా వదలరు. కనుక మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు వచ్చిపోతుంటాయి. కానీ మనం మరాఠా ప్రజలకోసం ఉ‍న్న సంగతి మర్చిపోకూడదు. మరాఠా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే తమ పార్టీ కార్పొరేటర్లు వారిని మోకాళ్ల మీద నిలబడేలా చేస్తారు" అని లేఖ విడుదల చేశారు.

కాగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 25 చోట్ల మహాయుతి కూటమి విజయాన్ని సాధించింది. అక్కడ మెుత్తం 227 కౌన్సిల్ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 114 అయితే బీజైపీకి 89 స్థానాలు రాగా శివసేన (శిండే) 29 వార్డులు సాధించింది. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)