Breaking News

108 అశ్వాలతో ప్రధాని మోదీ శౌర్య యాత్ర

Published on Sun, 01/11/2026 - 11:05

గాంధీనగర్‌: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తన రెండో రోజు పర్యటనను ఆదివారం ప్రారంభించారు. ఆధ్యాత్మికత, దేశభక్తి మేళవింపుతో ఇది మొదలయ్యింది. ఉదయం 9:45 గంటలకు సోమనాథ్‌లో నిర్వహించిన భారీ ‘శౌర్య యాత్ర’లో ఆయన పాల్గొన్నారు. 108 అశ్వాలతో సాగిన ఈ ప్రదర్శన సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరిస్తూ ముందుకు సాగింది.


 

 ‘శౌర్య యాత్ర’లో పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు జైజై నినాదాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పునర్వైభవానికి ప్రతీకగా నిర్వహించిన స్వాభిమాన్ పర్వ్ శౌర్య యాత్ర అనంతరం ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెయ్యేళ్ల క్రితం (క్రీ.శ. 1026లో) జరిగిన దాడులను తట్టుకొని నిలబడిన ఈ పుణ్యక్షేత్రం భారత నాగరికతకు, పట్టుదలకు నిదర్శనమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.
 


 ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు శనివారం సాయంత్రం ఆయన శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో పాల్గొని, భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. సోమనాథ్‌లో నిర్వహించే కార్యక్రమాల అనంతరం ప్రధాని రాజ్ కోట్ చేరుకోనున్నారు. అక్కడ మధ్యాహ్నం 1:30 గంటలకు పారిశ్రామిక ప్రదర్శన  ప్రారంభించనున్నారు. అనంతరం మార్వాడీ యూనివర్సిటీలో ప్రాంతీయ వైబ్రెంట్ గుజరాత్ సదస్సును ప్రారంభించి, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)