లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
స్టార్టప్లపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: పీయూష్ గోయల్
Published on Sat, 04/05/2025 - 08:44
న్యూఢిల్లీ: భారత్ స్టార్టప్లను ఉద్దేశించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. విమర్శించడం తేలికని, భారత్కు భారీస్థాయిలో ఏఐ మోడల్ ఎందుకు లేదో విశ్లేషించాలని, ఎదగడానికి ప్రయత్నిస్తున్నవారిని అణచి వేయకూడదని పలు కంపెనీల సీఈవోలు, గోయల్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.
అయితే.. భారత స్టార్టప్ల(Indian Start Ups)ను తానేం తక్కువ చేయలేదని గోయల్ అంటున్నారు. చైనా తరహాలో ఏఐ వంటి అంశాలపై దృష్టి సారించాలని మాత్రమే తాను సూచించానని, దీనిపై పలు రకాల విమర్శలు రావడంతో కాంగ్రెస్ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తోందని గోయల్ ఆరోపించారు.‘‘నేను చేసిన వ్యాఖ్యలు చాలామందికి సానుకూలంగానే తీసుకున్నారు. భారత్ పోటీ ప్రపంచంలో ముందు ఉండేందుకు సిద్ధమని నాతో చెప్పారు. కానీ, కొందరు మాత్రం నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు’’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయల్ అన్నారు.
స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గోయల్ మాట్లాడుతూ.. దేశంలోని పలు స్టార్టప్ కంపెనీలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్లపై ఎక్కువగా దృష్టి సారించాయన్నారు. కానీ చైనాలోని స్టార్టప్లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు. కానీ, మనం ఐస్క్రీం, చిప్స్ అమ్మడం దగ్గరే ఉన్నాం. ఇక్కడే మనం ఆగిపోకూడదు. డెలివరీ బాయ్స్/గర్ల్స్గానే మిగిలిపోదామా? అదే భారత్ లక్ష్యమా..? అది స్టార్టప్ల ఉద్దేశం కాదు కదా’’ అని అన్నారు.
అయితే.. భారత్లో స్టార్టప్లను తక్కువ చేయొద్దంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఓ పోస్ట్ చేసింది. భారత్లో స్టార్టప్ కంపెనీలు పడుతున్న కష్టాలను పీయూష్ గోయల్ అంగీకరించారు. తద్వారా స్టార్టప్లపై ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారం అబద్ధాలేనని మంత్రి వ్యాఖ్యలతో తేటతెల్లమైంది అని ఎక్స్లో ఓ పోస్ట్ చేసింది.
Modi's Minister Reveals India's Struggling Startup Ecosystem 👇 pic.twitter.com/7V7uVG316d
— Congress (@INCIndia) April 4, 2025
Tags : 1