Breaking News

Odisha: ఒక్కసారిగా పట్టాలు తప్పిన మూడు బోగీలు..

Published on Thu, 02/05/2026 - 13:24

జాజ్‌పూర్: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. జఖపురా రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలులోని మూడు బోగీలు ఒక్కసారిగా ట్రాక్ పైనుంచి పక్కకు జరిగాయి. భువనేశ్వర్ నుండి కోల్‌కతా మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం 8:51 గంటలకు ప్రమాదం జరగగా, భువనేశ్వర్, ఖుర్దా రోడ్ నుండి ప్రమాద సహాయక రైళ్లు ఘటనా స్థలానికి బయలుదేరాయి. వీటితో పాటు ఖుర్దా రోడ్ నుండి అత్యాధునిక వైద్య పరికరాల బృందాన్ని కూడా పంపించారు. భద్రక్ నుంచి వచ్చిన ప్రత్యేక సహాయక బృందం కూడా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను వేగవంతం చేసింది.

ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. భద్రక్ నుండి వచ్చిన ఇంజనీరింగ్ బృందాలు పట్టాలను సరిచేసి, రైలు రాకపోకలను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాయి. సీనియర్ రైల్వే అధికారులు  ఘటనా స్థలంలో ఉండి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని  నిర్ధారించారు. కాగా, ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఢిల్లీ-ముంబై మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సమాచారం.

ఇది కూడా చదవండి: ఉత్తరాదిపై పన్నీర్‌సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)