Breaking News

నీట్‌ పేపర్ లీక్‌ కేసు: నలుగురు విద్యార్థులపై సీబీఐ విచారణ

Published on Thu, 07/18/2024 - 15:10

పట్నా: నీట్‌ పేపర్‌ లీక్‌, నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.  ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా  గురువారం సీబీఐ అధికారులు నలుగురు పట్నా ఎయిమ్స్‌ విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. పేపర్‌ లీక్‌కు సంబంధించి వారిని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ  సందర్భంగా పట్నా ఎయిమ్స్‌ డైరెక్టర్ బీజే పాల్ మీడియాతో మాట్లాడారు.

‘సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న నలుగురు విద్యార్థులు  విచారణకు సహకరిస్తున్నారు. సీబీఐ విచారణ నుంచి విద్యార్థులు ఇంకా తిరిగి  రాలేదు. సీబీఐ విచారణ చేస్తున్న విద్యార్థులు చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాను, కరణ్.  ముందుగా ఇన్‌స్టిట్యూట్‌కు సీబీఐ అధికారులు సమాచారం అందించి..  నలుగురు విధ్యార్థులను వారి  హాస్టల్‌ నుంచి  అదుపులోకి తీసుకున్నారు. నీట్‌ పేపర్‌ లీవ్‌ విషయంలో వారిని విచారణ చేసేందుకు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు’ అని  తెలిపారు.

విచారణలో భాగంగా విద్యార్థుల రూంలను అధికారులు సీజ్‌ చేశారు. ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌,డీన్ సమక్షంలో  సీబీఐ టీం విద్యార్థుల ఫోటోలు , మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇక జూలై 17  పేపర్ లీక్‌ ప్రధాన నిందితుడు పంకజ్‌ త్రిపాఠి, అతని సహాయకుడు రాజు సింగ్‌ను సీబీఐ అధికారులు జార్ఖండ్‌లోని  హజారీబాగ్‌లో అరెస్ట్‌ చేశారు.  

ఇటీవల పరీక్ష నిర్వహించిన ఎన్‌టీఏ ట్రంక్‌ పెట్టె నుంచి నీట్‌ పేపర్‌ దొంగిలిచిన ఇద్దరిని కూడా సీబీఐ అరెస్ట్‌ చేసింది.మరోవైపు.. ప్రధాన నిందితుడు పంకజ్‌ త్రిపాఠికీ సీబీఐ ప్రత్యేక  కోర్టు.. 14రోజుల సీబీఐ కస్టడీ, అతని సహాయకుడు రాజు సింగ్‌కు 10 రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో  సీబీఐ అధికారులు 14 మందిని అరెస్ట్‌ చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)