Breaking News

మెగా చినాబ్‌ డ్యామ్‌ ప్రాజెక్ట్‌ వేగవంతం 

Published on Mon, 02/09/2026 - 05:39

న్యూఢిల్లీ: ముష్కర మూకల దాడులతో పేట్రేగిపోతున్న పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పే లక్ష్యంతో పాకిస్తాన్‌ జల జీవనాడిని దెబ్బకొట్టాలని మోదీ సర్కార్‌ నిర్ణయించింది. ఇందులోభాగంగా సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా చినాబ్‌ డ్యామ్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. రామ్‌బాన్‌ జిల్లాలో రూ.5,129 కోట్లతో నిర్మించతలపెట్టిన సావల్‌కోట్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ కోసం తాజాగా టెండర్లు పిలిచింది. 

ప్రభుత్వ రంగ నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఈ టెండర్లను ఆహ్వానించింది. పాకిస్తాన్‌కు నీటి అవసరాలు తీర్చే చినాబ్‌ నదిపై ఈ జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించనున్నారు. 1,856 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్‌పూర్తయితే ఈ ప్రాంతంలోనే అతిభారీ హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌గా ఇది నిలిచిపోనుంది. 

సిందూ నదీజలాల ఒప్పందాన్ని స్తంభింపజేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పడంతోపాటు సరిహద్దు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కొత్త ప్రాజెక్ట్‌ బాటలుపరుస్తుందని ఎన్‌డీఏ సర్కార్‌ తాజాగా పునరుద్ఘాటించింది. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి డ్యామ్, సొరంగాలు, అనుబంధ పనులకు సంబంధించిన టెండర్లు వచ్చే నెల 12వ తేదీతో మొదలై 20వ తేదీతో ముగుస్తాయి. టెండర్లలోని నిబంధనలు బిడ్‌ అనేది గరిష్టంగా 180 రోజులపాటు మనుగడలో ఉంటుంది. గరిష్టంగా 3,285 రోజుల్లోపు ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏకబిగిన దాదాపు పదిసంవత్సరాలపాటు డ్యామ్‌ నిర్మాణపనులు జరగనున్నాయి.  

దశాబ్దాల కల...: ఈ ప్రాంతంలో సావల్‌కోట్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ డ్యామ్‌ కట్టాలని భారత్‌ దశాబ్దాల క్రితమే భావించింది. అయితే గతంలో పాక్‌తో సింధూ నదీజలాల ఒప్పందం అమల్లో ఉండటం, సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఈ ప్రాజెక్ట్‌ కాగితాలకే పరిమితమైంది. అయితే గత ఏడాది పహల్గామ్‌ పచ్చికమైదానాల్లో 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చి హేయమైన చర్యలకు దిగడంతో భారత్‌ ఉగ్రరూపం దాల్చింది. 

ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట ముష్కరుల శిక్షణ శిబిరాలతోపాటు పాక్‌ వైమానిక స్థావరాలపై ముప్పేట దాడులు చేసింది. ఆ తర్వాత సిందూ నదీజలాల ఒప్పందం నుంచి గత ఏడాది ఏప్రిల్‌ నెలలో తప్పుకుంది. పాకిస్తాన్‌కు నీటికష్టాలు పెంచాలనే ఉద్దేశంతో వెంటనే పాత సావల్‌కోట్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే జమ్మూకశీ్మర్‌ విద్యుత్‌ కష్టాలు తీరడంతోపాటు జాతీయ పవర్‌గ్రిడ్‌ సామర్థ్యం సైతం పెరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఈ ప్రాంతంలో మౌలికసదుపాయాలు మెరుగవనున్నాయి.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)