Breaking News

శ్రద్ధా తరహాలో మరో దారుణం.. అతడితో వివాహేతర సంబంధం.. చివరకు..

Published on Sat, 12/03/2022 - 15:58

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, యువతులపై వరుస క్రైమ్‌లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరో వివాహిత దారుణ హత్యకు గురైంది. 

వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీ తిలక్ నగర్‌కు చెందిన వివాహిత రేఖా రాణి(35) మన్‌ప్రీత్ సింగ్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే, అప్పటికే పెళ్లై పిల్లలున్న మన్‌ప్రీత్‌.. 2015 నుంచి రేఖా వాణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మరోవైపు.. రేఖకు 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇదిలా ఉండగా.. కొన్నేళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా ఇటీవలి కాలంలో చాలాసార్లు గొడవపడ్డారు. దీంతో, రేఖ అడ్డుతొలగించుకోవాలని మన్‌ప్రీత్‌ భావించాడు. 

ఈ క్రమంలోనే ఆమెను చంపాలని డిసైడ్‌ అయ్యాడు. అనుకున్నదే తడవుగా మన్‌ప్రీత్‌.. డిసెంబర్‌ 1వ తేదీన రేఖ ఇంటికి వెళ్లాడు. అనంతరం, రాత్రి రేఖ కుమార్తెకు నిద్రమాత్రలు వేసి, ఆమె నిద్ర పోయిన తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో రేఖను దారుణంగా నరికి చంపాడు. సెకోలా వ్యవహరించి ఆమె మెడపై కత్తితో కోసి, కుడి చేతి వేలును కోసివేశాడు. ఇలా పైశాచికత్వం ప్రదర్శించాడు. కాగా, నిద్రలో నుంచి లేచి చూసేసరికి రేఖ మృతదేహాన్ని చూసి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కన్నీరుపెట్టుకుంది. 

దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు రేఖ శరీరాన్ని కత్తితో భాగాలు చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ.. కుమార్తె గుర్తిస్తుందని భయపడినట్లు పోలీసులు వెల్లడించారు. రేఖ కూమర్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, మన్‌ప్రీత్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)