Breaking News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పరిహారంగా రూ.65.62లక్షలు 

Published on Wed, 12/14/2022 - 11:18

సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా రూ.65.62 లక్షలు చెల్లించాలని థానె జిల్లా మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ ట్రిబ్యునల్‌ (ఎంఏసీటీ) బీమా సంస్థ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ను, ప్రమాదానికి కారణమైన మరో వాహనదారుడిని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఏడాదికి 8శాతం వడ్డీతో సహా సదరు బాధిత కుటుంబానికి అందజేయాలని ఎంఏసీటీ స్పష్టం చేసింది. ఈమేరకు ఎంఏసీటీ సభ్యుడు హెచ్‌.ఎం భోశాలే ఆదేశాలిచ్చారు. అయితే ఈ ఆదేశాలను గతనెల 16న ఇవ్వగా సోమవారం లిఖితపూర్వకంగా బీమా సంస్థకు, సదరు వాహన యజమానికి అందజేశారు.  

పిటిషనర్‌తరఫున ఎస్టీ కదమ్‌ ట్రిబ్యునల్‌ వాదనలు వినిపించారు. సందేశ్‌ షిండే (35) అనేవ్యక్తి తన స్నేహితుడితో కలసి మోటార్‌ సైకిల్‌పై కోపార్టైన్‌కు 2020 మార్చి 18 రాత్రి బయల్దేరి వెళ్తుండగా.. ఒక ట్రాలర్‌ వచ్చి వారిని వేగంగా ఢీకొట్టండంతో వాళ్లిద్దరూ పడిపోయారు. అయితే సందేశ్‌ షిండే అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. షిండే చనిపోయేనాటికి ఓ ప్రైవేటు కంపెనీలో నెలకు రూ.32.655 జీతాన్ని సంపాదిస్తున్నాడు. ఆ కుటుంబానికి షిండేనే ఆధారం కావడంతో అతని మృతితో కుటుంబం రోడ్డున పడిపోయింది.

అతడికి భార్య, ఇద్దరు కొడుకులు, తల్లి ఉన్నారు. షిండే మృతి అనంతరం ప్రమాదానికి కారణమైన ట్రాలర్‌ యజమానితోపాటు బీమా సంస్థ నేష నల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ కూడా వీరికి నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకోకుండా వివి« ద రకాల కారణాలను చూపి అడ్డుకున్నారు. అయితే ఎంఏసీటీలో వాదనల అనంతరం బాధిత కుటుంబానికి రూ.63.96లక్షలు నష్టపరిహారంగా, రూ.16,500 మట్టి ఖర్చులకుగా ను, భార్యకు రూ.44000, తల్లికి రూ.88,000 చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.    
చదవండి: కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి.. పలువురికి అస్వస్థత

Videos

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

మా నాయకుడు జగన్ అని గర్వంగా చెప్తాం రాచమల్లు గూస్ బంప్స్ కామెంట్స్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)