Breaking News

‘చేయిచాచి రూ. 500 సాయం అడిగితే రూ. 51 లక్షలు వచ్చాయి’

Published on Thu, 12/22/2022 - 10:50

ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఓ మహిళకు కుంటుంబ పోషణ భారమైంది.. పూట గడవడమే కష్టంగా మారింది.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. తప్పని పరిస్థితుల్లో కొడుకుకు చదువు చెబుతున్న టీచర్‌ను సాయం కోసం అర్థించింది. పిల్లల కడుపు నింపడం కోసం రూ. 500 ఉంటే ఇవ్వాలని కోరింది.. ఊహించని విధంగా ఆమె ఆకౌంట్‌లోకి రూ. 51లక్షలు వచ్చి చేరాయి. దీంతో ఆశ్చర్యపోయిన మహిళ ఆనందంతో కంటతపడి పెట్టుకుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన సుభద్ర అనే 46 ఏళ్ల మహిళకు ముగ్గురు కొడుకులు. ఆమె భర్త గత ఆగష్టులో మరణించాడు.. కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి మరణంతో  వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మహిళ ఒక్కతే కాయాకష్టం చేసుకొని పిల్లలను సాకుతోంది. చిన్న కొడుకు రిబ్రల్ పాల్సి వ్యాధితో కదల్లేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు.

కుటుంబం గడవడానికి మరో దారి కనిపించకపోవడంతో రెండు కొడుకు అభిషేక్‌ చదువుతున్న పాఠశాలలోని హిందీ టీచర్‌ర్‌ రిగిజా హరికుమార్‌ను కొంత డబ్బు సాయం చేయాలని అడిగింది. తన ముగ్గురు పిల్లల ఆకలి తీర్చేందుకు ఓ 500 రూపాయలు ఉంటే ఇవ్వాలని దీనంగా వేడుకుంది. ఆ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన ఉపాధ్యాయురాలు తన వంతు సాయంగా వెయ్యి రూపాయలు అందించింది.
చదవండి: సిస్టర్‌హుడ్‌.. అత్యంత అవసరమైన బంధం

అంతటితో ఆగకుండా సుభద్ర ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని దగ్గరుండి పరిశీలించింది. ఈ క్రమంలో ఆ కుటుంబం పుట్టేడు పేదరికంలో మగ్గుతుండటం చూసింది. ఇల్లు సరిగా లేకపోవడం, పిల్లలు తినడానికి కూడా ఏం లేని స్థితిని చూసి వారికోసం ఇంకేమైనా చేయాలని ఆలోచించింది. దీంతో తన పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆదుకోవాలని కోరుతూ.. క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. దాతలు సాయంగా అందించే డబ్బు నేరుగా ఆమె అకౌంట్‌కు బదిలీ అయ్యేలా సుభద్ర బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను జత చేసింది.

టీచర్‌ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో రెండు రోజుల్లోనే వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి విరాళంగా రూ. 51 లక్షలు మహిళ బ్యాంక్ ఖాతాలోకి వచ్చాయి. దీంతో టీచర్‌ గొప్ప మనసును పలువురు అభినందిస్తున్నారు. ఈ విషయంపై ఉపాద్యాయురాలు గిరిజా మాట్లాడుతూ.. ‘వారి గురించి పోస్ట్ చేస్తున్నప్పుడు నా మనస్సులో రెండే ఆలోచనలు ఉన్నాయి. 1. అసంపూర్తిగా ఉన్న వారి ఇంటిని పూర్తిగా నిర్మించి మంచిగా జీవించాలి. 2. ఆ తల్లి తన పిల్లలకు ఆహారం చదువు కోసం ఎవరి ముందు చేయిచాచకూడదు. ఈ రెండింటి గురించే ఆలోచించి ఇలా చేశారు. వచ్చిన డబ్బుని ఇంటికోసం ఉపయోగించి, మిలిన దానిని వారి ఖర్చుల కోసం బ్యాంకులో జమ చేస్తాం. సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు’ అంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. 
చదవండి: Covid Alert: కరోనా ముప్పు ముగియలేదు.. మళ్లీ మాస్కులేద్దాం

Videos

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)