Breaking News

karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్

Published on Thu, 01/22/2026 - 12:28

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే  అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు (గురువారం) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే నిష్క్రమించారు. కేవలం రెండు లైన్లు మాత్రమే చదివి, తన ప్రసంగాన్ని ముగించడం సభలో తీవ్ర కలకలం రేపింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)నకు సంబంధించిన వివాదాస్పద చట్టంపై ప్రభుత్వం ప్రస్తావించిన కొన్ని పేరాలపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రచారంలో భాగంగా ఉన్నాయంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన  బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పెరుగుతున్న అగాధానికి అద్దం పడుతోంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మరుసటి రోజే కర్ణాటకలో ఈ తరహా ఘటన జరగడం గమనార్హం. అంతకుముందు కేరళ గవర్నర్ కూడా తన ప్రసంగంలోని కొన్ని భాగాలను చదవకుండా వదిలేశారు.

 

కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలలోని దాదాపు 11 పేరాలను తొలగించాలని గవర్నర్ గెహ్లాట్ ముందే సూచించారు. అయితే, ప్రభుత్వం వాటిని మార్చకపోవడంతో ఈ ప్రతిష్టంభన నెలకొంది. కాగా గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని చదవకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 మరియు 163 ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతను గవర్నర్ విస్మరించారని, దీనిపై నిరసన తెలపడంతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)