Breaking News

నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ లాక్‌డౌన్‌ ఖాయం

Published on Thu, 07/08/2021 - 09:55

సాక్షి, బెంగళూరు: మహమ్మారి కరోనా తగ్గినట్లే తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,743 పాజిటివ్‌ కేసులు నిర్ధారించారు. 3,081 మంది కోలుకున్నారు. 75 మంది కన్నుమూయడంతో మొత్తం మరణాలు 35,601 మందికి పెరిగాయి. కరోనా కేసుల మొత్తం 28,62,338, డిశ్చార్జ్‌లు 27,87,111 కి చేరాయి. 39,603 మంది కరోనాతో చికిత్స పొందతుండగా పాజిటివిటీ రేటు 1.64 శాతంగా ఉంది.  

బెంగళూరులో 611 కేసులు..  
ఐటీ సిటీలో తాజాగా 611 కేసులు, 693 డిశ్చార్జిలు, 12 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,17,507కు పెరిగింది. అందులో 11,87,666 మంది కోలుకున్నారు. 15,702 మంది మరణించారు. 14,138 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,66,631 నమూనాలు పరీక్షించారు. మొత్తం టెస్టులు 3,53,18,762 అయ్యాయి. మరో 2,08,439 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. దీంతో మొత్తం టీకాల సంఖ్య 2,46,91,636 కి పెరిగింది.  

నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ లాక్‌డౌన్‌
దొడ్డబళ్లాపురం: అన్‌లాక్‌ చేశామని జనం ఇష్టానుసారంగా తిరిగి కరోనా వ్యాప్తికి కారణమయితే 15 రోజుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేయాల్సి వస్తుందని, కాబట్టి కరోనా నియమాలను కట్టుదిట్టంగా పాటించాలని సీఎం యడియూరప్ప ప్రజలను హెచ్చరించారు. దొడ్డ పట్టణంలో నూతనంగా నిర్మించిన కోవిడ్‌ తాత్కాలిక ఆస్పత్రిని ఆయన బుధవారం ప్రారంభించారు. 70 బెడ్లతో ఆస్పత్రిని నిర్మించామన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.    

Videos

PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను

YSRCP మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశం

పాక్ కు కోలుకోలేని దెబ్బ, బలోచిస్తాన్‌కు భారత్ సపోర్ట్ ?

Ambati: అర్ధరాత్రి ఒక మహిళపై పోలీసులే దాడి.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?

YS Jagan: వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం

మురళీ ఎక్కడ ఉన్నావ్.. జగన్ సార్ వచ్చాడు సెల్యూట్ చెయ్

మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం..

Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

శ్రీకాకుళం జిల్లా కొరాఠి ఫీల్డ్ అసిస్టెంట్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు

Photos

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)