Breaking News

భారత్‌ జోడో యాత్రలో కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 12/24/2022 - 18:34

కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో రాహుల్‌ గాంధీకి భారీ మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా రాహుల్‌కు మద్దుతు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, అనూహ్యంగా రాహుల్‌ యాత్రలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, నటుడు కమల్‌ హాసన్‌ పాల్గొని తన మద్దతు ప్రకటించారు. 

భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా కమల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. దేశం కోసం చేతులు కలపాల్సిన సమయం వచ్చింది. రాహుల్‌ జోడో యాత్రలో పాల్గొనవద్దని చాలా మంది చెప్పారు. రాహుల్‌ యాత్రలో పాల్గొంటే పొలిటికల్‌ కెరీర్‌ దెబ్బతింటుందని చెప్పారు. నేను భారతీయుడిగా ఇక్కడ ఉన్నాను. మా నాన్న కాంగ్రెస్‌ వాది. నేను వివిధ సిద్ధాంతాలను కలిగి ఉండి, నా సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాను. కానీ దేశం విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి. నేను అద్దం ముందు నిలబడి నాకు నేను చెప్పుకున్నాను. ఇది.. దేశానికి, నాకు అత్యంత అవసరమైన సమయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇక రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర.. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోకి చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్‌కు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా, పాదయాత్రలో భాగంగా రాహుల్‌ ఇప్పటికే 3వేల కిలోమీటర్లు పూర్తి చేశారు. భారత్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి జమ్మూకాశ్మీర్‌లో ముగిసేలోపు రాహుల్‌ 3,570 కిమీలు ప్రయాణించనున్నారు. ఇందులో భాగంగానే 12 రాష్ట్రాలను రాహుల్‌ కవర్‌ చేయనున్నారు. 

భారత్ జోడో యాత్ర శనివారం న్యూఢిల్లీలోని ఎర్రకోటకు చేరుకున్న సందర్బంగా రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా రాహుల్‌ మాట్లాడుతూ.. దేశాన్ని వాస్తవ సమస్యల నుండి మళ్లించడానికి బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను వ్యాప్తి చేస్తోందని అన్నారు. ఇది ప్రధాని మోదీ ప్రభుత్వం కాదు.. అంబానీ, అదానీల ప్రభుత్వం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)