Breaking News

కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్‌ఎం’లో ఉత్సాహం ఉరకలు

Published on Tue, 02/17/2026 - 11:59

న్యూఢిల్లీ: నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి  కేంద్ర ఎన్నికల సంఘం 'టార్చ్ లైట్' చిహ్నాన్ని కేటాయించింది. రాబోయే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ గుర్తు కేటాయించారు. ఈ గుర్తుపైనే ఎంఎన్ఎం అభ్యర్థులు పోటీ చేస్తారని ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని పార్టీ మీడియా విభాగం  తెలియజేసింది.

త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం మక్కల్ నీధి మయ్యం ఇప్పటికే తన సన్నాహాలను వేగవంతం చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఇందులో భాగంగా ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమాఖ్య వ్యవస్థ, గ్రామీణ ఉపాధి సంస్కరణలు తదితర కీలక అంశాలపై పార్టీ తన విధానాలను స్పష్టం చేసింది.

2026 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని పార్టీ కార్యవర్గ కమిటీ ప్రకటించింది. అభ్యర్థుల నామినేషన్ రుసుమును రూ. 50,000గా నిర్ణయించారు. ముందస్తుగా అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా నియోజకవర్గాల్లో పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు.

కమల్ హాసన్ 2018, ఫిబ్రవరి 21న మధురై వేదికగా అవినీతి నిర్మూలన, మతతత్వ వ్యతిరేక ఎజెండాతో మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించారు. ఎంఎన్ఎం పార్టీ ప్రస్తుతం డిఎంకె నేతృత్వంలోని కూటమిలో భాగంగా ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్  పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తూనే, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.

ఇది కూడా చదవండి: ‘7 సిస్టర్స్‌’పై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)