Breaking News

వయనాడ్‌ విధ్వంసం.. కుటుంబాన్ని రక్షించేందుకు అధికారుల సాహసం

Published on Sat, 08/03/2024 - 14:00

కేరళలోని వయనాడ్‌ విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం కొండచరియలు విరిగిపడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 358కు చేరుకుంది.  మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయిదో రోజు సెర్చ్‌, రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టే  ప్రయత్నం చేస్తున్నారు. కాగా వయనాడ్‌లో వర్షాలు పడుతున్నా, అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. 

అధికారుల సాహసోపేతమైన ఆపరేషన్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసలు కురిపించారు. ఈ వారం ప్రారంభంలో వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో 350 మందికి పైగా మరణించారు మరియు వందల మంది తప్పిపోయారు.

ఈ క్రమంలో తాజాగా అటవీ శాఖ అధికారులు ఎనిమిది గంటలు శ్రమించి ఓ కుటుంబాన్ని ప్రాణాలతో రక్షించారు.  కొండ ప్రాంతంలో చిక్కుకున్న గిరిజన వర్గానికి చెందిన నలుగురు చిన్నారులతో సహా తల్లిదండ్రులను ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు.

పనియా కమ్యూనిటీకి చెందిన కుటుంబం లోతైన లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఉన్న గుహలో చిక్కుకుపోయింది. దీంతో కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని బృందం అడవిలో చిక్కుకున్న గిరిజన కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి వెళ్లి రక్షించారు. అయితే వారిని చేరుకోవడానికి రెస్క్యూ టీమ్ నాలుగున్నర గంటలపాటు ప్రమాదకరమైన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 అయితే వారు కొద్ది రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో నలుగురు పిల్లల తల్లి ఆహారం కోసం అడవిలో వెతుకుతూ ఉండగా తమ కంటపడినట్లు అధికారులు తెలిపారు. తాము రక్షించిన వారిలో తల్లిదండ్రులు, 1 నుంచి 4 ఏళ్ల మధ్యనున్న నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు.  తమతో రావాల్సిందిగా వారిని కోరగా ముంగు ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని తెలపగా చివరకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. 

రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన అధికారులు సీఎం పినరయి విజయన్‌ ప్రశంసించారు. ‘‘వయనాడ్‌లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.
 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు