Breaking News

ఆగస్టు 17 నుంచి 23 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ర్యాలీలు: కాంగ్రెస్‌

Published on Thu, 08/11/2022 - 15:58

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ  అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో మెహంగై చౌపాల్(ధరల పెరుగుదల పై చర్చలు) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 17 నుంచి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండీలు, రిటైల్‌ మార్కెట్లు వంటి తదితర ప్రదేశాల్లో ధరల పెరుగుదల పై ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాం‍గ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్‌ తెలిపారు.

ఈ నిరసన ర్యాలీలు ఆగస్టు 28న ఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్స్‌లో  సీనియర్‌ నాయకులు ధరలపై నోరెత్తండి అనే ప్రసంగంతో ముగిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేరకంగా ఆగస్టు 5న దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనలు ప్రజల్లో బలంగా వెళ్లి ప్రతి ధ్వనించాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చట్టబద్ధమైన నిరసనను చేతబడి లేదా క్షద్ర శక్షులుగా చిత్రకరించే ప్రయత్నం చేశారని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు తమ ప్రభుత్వ వైఫల్యాల విషయమైన మోదీలో కలుగుతున్న అభద్రత భావాన్ని తేటతెల్లం చేస్తోందంటూ... ఆరోపణలు చేశారు. రానున్న వారాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం పై వరుస నిరసనలతో కాంగ్రెస్‌ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు.  మెదీ చేస్తున్న ఆర్థిక దుర్వినియోగాన్ని కూడా బయట పెడతామని అన్నారు.

ఈ మేరకు పెరుగు, మజ్జిగ , ఫ్యాకేజ్డ్‌ ఆహారధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల పై అధిక పన్నుల విధించడం వల్ల ద్రవ్యోల్బణం తీవ్రమవుతోందన్నారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ పరం చేయడం, అగ్నిపథ్‌ వంటి తప్పుదారి పట్టించే  పథకాలను ప్రవేశపెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని జై రాం రమేష్‌ అన్నారు. 

(చదవండి: ఈ ఫుడ్‌ని జంతువులు కూడా తినవు ... కానిస్టేబుల్‌ ఒకటే ఏడుపు)

Videos

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

Photos

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)