Breaking News

కోలుకుని బయటపడ్డా... వెంటాడుతున్న కరోనా లక్షణాలు

Published on Thu, 05/12/2022 - 15:33

న్యూఢిల్లీ: కరోనాతో గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతలా అతలాకుతలమయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆ కరోనామహమ్మారి నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే కరోనా నుంచి బయటపడి బతికి ఉన్నవారు ఇంకా ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలను ఎదుర్కొంటునే ఉన్నారని లాన్సెట్‌ మెడికల్ జర్నల్ తన అధ్యయనం తెలిపింది. మరి కొంతమంది కోవిడ్‌ నుంచి కోలుకుని వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండానే శారీరికంగా, మానసికంగానూ ఆరోగ్యంలో మంచి మెరుగుదల కనిపించిందని వెల్లడించింది.

రెండేళ్ల తదనంతరం కొంతమంది మునుపటివలే తమ పనులను చేసుకోగలగడమే కాకుండా తమ రోజువారి పనిలో యథావిధిగా నిమగ్నమవుతున్నారు కూడా. కానీ ఇంకా కొంత మంది ఆ వ్యాధికి సంబంధించిన దుష్ఫలితాలను ఎదుర్కొంటునే ఉన్నారు. భవిష్యత్తులో కోవిడ్‌కి సంబంధించి పొంచి ఉ‍న్న దీర్ఘకాలిక వ్యాధి లక్షణాల ప్రమాదంపై మరిన్ని పరిశోధనలు చేయడమే కాకుండా మరింత మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని తెలిపింది. అంతేగాదు గత రెండేళ్లలో కరోనా నుంచి బయటపడిన వారందరూ సాధారణ జనాభా కంటే చాల తక్కువ ఆరోగ్య స్థితిని కలిగి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది.

మరోవైపు యూకే అధ్యయనం ప్రకారం ఆస్పత్రిలో చేరిన నలుగురిలో ఒకరు మాత్రమే కోవిడ్‌ బారిన పడి ఒక ఏడాది తర్వాత పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. కండరాల నొప్పి, శారీరకంగా మందగించడం, నిద్రలేమి, శ్వాస ఆడకపోవడం, అవయవాల పటుత్వం లేకపోవడం, జీవన నాణ్యతలో మార్పులు తదితరాలు సాధారణ దీర్ఘకాలిక కోవిడ్‌ లక్షణాలు.  ఏదీఏమైన కరోనాతో ఆసుపత్రిలో చేరిన చాలామంది రోగులు సుమారు ఐదు నెలల నుంచి ఒక ఏడాదిలోపు పరిమిత సంఖ్యలో పూర్తిగా కోలుకోవడం మాత్రం అద్భుతమైనది అని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాచెల్ ఎవాన్స్ చెప్పారు.

(చదవండి: Covid 19: ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్‌ కీలక నిర్ణయం)

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)