Breaking News

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన

Published on Fri, 10/06/2023 - 02:14

జూనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

యాదగిరిగుట్ట: పట్టణ పరిధిలోని యాదగిరిపల్లిలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హాస్టల్‌లో పనిచేసే ఉద్యోగి.. అదే కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిని సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ షఫియాజ్‌ అక్తర్‌ గురువారం తెలిపారు. వివరాలు.. గతంలో వీఆర్వోగా పనిచేసిన డి. శ్రీనివాస్‌ గతేడాది ఆగస్టులో వీఆర్వోల సర్దుబాటులో భాగంగా యాదగిరిగుట్ట పాలిటెక్నిక్‌ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధుల్లోకి చేరాడు. జూనియర్‌ అసిస్టెంట్‌తో పాటు బాలుర, బాలికల హాస్టల్‌లో డే మ్యాట్రన్‌(సూపర్‌వైజర్‌)గా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో బుధవారం సాయంత్రం కళాశాలలో ఉన్న ఓ విద్యార్థిని చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విద్యార్తిని తల్లిదండ్రులు గురువారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక విచారణ జరిపి డి. శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేశామని, శాఖాపరమైన విచారణకు ఆదేశించామని ప్రిన్సిపాల్‌ వెల్లడిచారు. విచారణ నివేదిక రాగానే అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇగ్నో కోర్సులు

సద్వినియోగం చేసుకోవాలి

రామగిరి(నల్లగొండ): ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఐజీఎన్‌ఓయూ–ఇగ్నో) ద్వారా అందిస్తున్న కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్‌ రీజనల్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజు బోళ్ల అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాల నందు జరిగిన కోర్సుల ప్రమోషనల్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇగ్నో ద్వారా అందిస్తున్న డిగ్రీ, మాస్టర్స్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులలో చేరడానికి దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి కోర్సు ఫీజు లేకుండా ఉచితంగా ప్రవేశం పొందవచ్చన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ కోర్సు చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశాలు తీసుకోవచ్చని అన్నారు. కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. దరఖాస్తు గడువును అక్టోబర్‌ 10 వరకు పెంచినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేకుండా డిగ్రీ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలు పొందే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు www.ignou.ac.in వెబ్‌సైట్‌ను లేదా 9492451812, 040 23117550 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్లు పి. శ్రీనివాస్‌, ఏ. అమృతారెడ్డి పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో

యువకుడు మృతి

రామన్నపేట: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. నీర్నెముల గ్రామానికి చెందిన సుర్వి లక్ష్మమ్మ కుమారుడు సతీష్‌(27) ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం లక్ష్మమ్మ కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు తీసి చూసేసరికి సతీష్‌ మృతిచెంది ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Videos

పవన్ పై సీపీఐ రామకృష్ణ సెటైర్లు

కలెక్షన్స్ లో ఖలేజా సెన్సేషన్

తండ్రి వివేక్ కి మంత్రి పదవి దక్కడంతో కొడుకు తీన్మార్ డాన్స్

మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

తగ్ లైఫ్ డిజాస్టర్ కు.. దుల్కర్ కు సంబంధం ఏంటి?

విజయవాడలో సెలూన్ షాప్ ప్రారంభించిన పవన్ కల్యాణ్

VVR కృష్ణం రాజు వ్యాఖ్యలపై పోతిన మహేష్ రియాక్షన్

భారత్ లో 6 వేలు దాటిన కోవిడ్ యాక్టివ్ కేసులు

కదం తొక్కిన టీచర్లు.. బాబుకు డెడ్ లైన్..

ఉస్కో అంటే ఊగిపోతున్న పోలీసులు

Photos

+5

గ్రాండ్‌గా అఖిల్‌- జైనాబ్ రిసెప్షన్‌ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి వరలక్ష్మీ దంపతులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : చేప మందు పంపిణీ.. పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మాగంటికి నేతలు కన్నీటి నివాళి (ఫొటోలు)

+5

అఖిల్‌ అక్కినేని సతీమణి 'జైనబ్‌' ఫోటోషూట్‌ లుక్స్‌ చూశారా..? (ఫొటోలు)

+5

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 07-14)

+5

గాయం నుంచి కోలుకుంటున్న రష్మీ.. అలా టైమ్‌పాస్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్‌ కనకాల దంపతులు (ఫోటోలు)

+5

మొత్తానికి శ్రీవారు ప్రపోజ్‌ చేశారు, సీక్రెట్‌ చెప్పిన ‘ప్రేమపావురం​’ (ఫొటోలు)