అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
Breaking News
అన్నయ్య కోసం 'బరి'లోకి దిగిన చెల్లెలు
Published on Sat, 03/28/2026 - 09:02
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి బరి అనే టైటిల్ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆపై ‘బరి’ మూవీకి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ యదు వంశీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని నిహారిక అధికారికంగా ప్రకటించారు. నేడు పూజా కార్యక్రమం జరిగింది. కుటుంబ బ్యానర్లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.
Power Star #PawanKalyan garu at our Mega Prince @IAmVarunTej 's New movie #Bhari Opening ceremony#VarunTej #NiharikaKonidela pic.twitter.com/fXPOmdT3SS
— Milagro Movies (@MilagroMovies) March 28, 2026
Tags : 1