Breaking News

గేమ్‌ ఛేంజర్‌తో భారీ నష్టాలు.. 'చరణ్‌' కనీసం ఫోన్‌ కూడా చేయలేదు: నిర్మాత

Published on Tue, 07/01/2025 - 08:18

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంలో నటించాలని చాలామంది నటీనటులకు కోరిక ఉంటుంది. ఆ సంస్థకు అంత గుర్తింపు రావడంలో నిర్మాత దిల్‌ రాజు పాత్ర చాలా కీలకం. అయితే, తెరవెనుక ఆయన సోదరుడు శిరీష్‌ రెడ్డి శ్రమ వెలకట్టలేనిదని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. అయితే, వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన వారిద్దరూ ఈ ఏడాదిలో రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో గేమ్‌ ఛేంజర్‌ను భారీ బడ్జెట్‌తో (రూ.450 కోట్లు) తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిజాస్టర్‌ వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి తాజాగా శిరీష్‌ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. గేమ్‌ ఛేంజర్‌ వల్ల వచ్చిన నష్టాలతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని చెప్పారు. కానీ,  'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అంతా మారిపోయిందని ఆయన అన్నారు.

గేమ్‌ ఛేంజర్‌ గురించి నిర్మాత శిరీష్‌ రెడ్డి ఇలా చెప్పారు.' గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం.  అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్‌ ఛేంజర్‌ ప్లాప్‌ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్‌ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు. 

మాకు ఇష్టం ఉండి సినిమా తీశాం. డబ్బు పోగొట్టుకున్నాం. రెమ్యునరేషన్‌లో కొంత ఇవ్వాలని మేము ఎవరినీ అడగలేదు.. అంత స్థాయికి మా సంస్థ ఇంకా దిగజారిపోలేదు. అయితే, మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్‌ను మేము కాపాడుకున్నాం. అయితే, గేమ్‌ ఛేంజర్‌ పోయిందని  రామ్‌ చరణ్‌తో ఎలాంటి విభేదాలు రాలేదు. మరో కథ వస్తే ఆయన వద్దకు వెళ్తాం.  ఆయన సినిమా చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. నిర్ణయం ఆయనదే కదా.. మేము ఎవరినీ బ్లేమ్‌ చేయడం లేదు. ఇష్టం ఉండి సినిమా తీశాం, పోగొట్టుకున్నాం. ఈ వ్యాపారంలో ఎవరినీ నిందించలేము. గేమ్‌ ఛేంజర్‌ వల్ల వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగాదో. కానీ, చాలా మొత్తంలో నష్టపోయాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బయటపడ్డాం.  గేమ్‌ ఛేంజర్‌ నష్టాన్ని సుమారు 70 శాతం వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్‌ చేసింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌  ఉండేది కాదని చెబుతాను. మమ్మల్ని తిరిగి నిలబెట్టింది అనిల్‌ అని నేను నమ్ముతా.' అని శిరీష్‌ రెడ్డి అన్నారు.

Videos

వెండిలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయా?

Annamayya District: ఈజీ మనీ కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠా

దిగొచ్చిన కూటమి సర్కార్

YS జగన్ టూర్ ను అడ్డుకోవడానికే పోలీసు వ్యవస్థ ఉందా..?: అంబటి

అంక్షల కంచెలు దాటుకుని వచ్చిన భారీగా తరలివచ్చిన అభిమానులు

మామిడిని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేయాలి: YS జగన్

పోలీసులు ఎలా కొట్టారంటే.. దాడిపై కార్యకర్త షాకింగ్ నిజాలు

జగన్ వచ్చాడంటే ఎలా ఉంటుందో చూసావా.. నీ 2 వేల మంది పోలీసులు..

బాబు కుంభకర్ణుడి నిద్ర లేపడానికే వేల మంది రైతులు వచ్చారు

జగనన్న కోసం బారికేడ్లు బద్దలు కొట్టుకొని వచ్చాం

Photos

+5

బంగారుపాళ్యం వీధుల్లో జనసునామీ (ఫొటోలు)

+5

బతుకమ్మకుంటకు జీవం పోసిన హైడ్రా.. నాడు అలా.. నేడు ఇలా (ఫొటోలు)

+5

శ్రీనారాయణపురం జలపాతాలు : మర్చిపోలేని అనూభూతిని ఇచ్చే పర్యాటక ప్రదేశం..!

+5

హీరో సిద్ధార్థ్‌ ‘3BHK’ మూవీ థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

'ఓ భామ అయ్యో రామ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు (ఫొటోలు)

+5

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి (ఫొటోలు)

+5

తేజస్వీ సూర్య శివశ్రీ స్కంద దంపతుల ఇంట్లోకి అందమైన అతిథి (ఫొటోలు)

+5

కొరియా సినిమాకు ఒక్క మగాడు (ఫొటోలు)

+5

'కోర్ట్‌' హీరోయిన్‌ శ్రీదేవికి గోల్డెన్‌ ఛాన్స్‌ (ఫొటోలు)