Breaking News

గేమ్‌ ఛేంజర్‌తో భారీ నష్టాలు.. 'చరణ్‌' కనీసం ఫోన్‌ కూడా చేయలేదు: నిర్మాత

Published on Tue, 07/01/2025 - 08:18

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంలో నటించాలని చాలామంది నటీనటులకు కోరిక ఉంటుంది. ఆ సంస్థకు అంత గుర్తింపు రావడంలో నిర్మాత దిల్‌ రాజు పాత్ర చాలా కీలకం. అయితే, తెరవెనుక ఆయన సోదరుడు శిరీష్‌ రెడ్డి శ్రమ వెలకట్టలేనిదని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. అయితే, వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన వారిద్దరూ ఈ ఏడాదిలో రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో గేమ్‌ ఛేంజర్‌ను భారీ బడ్జెట్‌తో (రూ.450 కోట్లు) తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిజాస్టర్‌ వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి తాజాగా శిరీష్‌ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. గేమ్‌ ఛేంజర్‌ వల్ల వచ్చిన నష్టాలతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని చెప్పారు. కానీ,  'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అంతా మారిపోయిందని ఆయన అన్నారు.

గేమ్‌ ఛేంజర్‌ గురించి నిర్మాత శిరీష్‌ రెడ్డి ఇలా చెప్పారు.' గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం.  అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్‌ ఛేంజర్‌ ప్లాప్‌ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్‌ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు. 

మాకు ఇష్టం ఉండి సినిమా తీశాం. డబ్బు పోగొట్టుకున్నాం. రెమ్యునరేషన్‌లో కొంత ఇవ్వాలని మేము ఎవరినీ అడగలేదు.. అంత స్థాయికి మా సంస్థ ఇంకా దిగజారిపోలేదు. అయితే, మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్‌ను మేము కాపాడుకున్నాం. అయితే, గేమ్‌ ఛేంజర్‌ పోయిందని  రామ్‌ చరణ్‌తో ఎలాంటి విభేదాలు రాలేదు. మరో కథ వస్తే ఆయన వద్దకు వెళ్తాం.  ఆయన సినిమా చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. నిర్ణయం ఆయనదే కదా.. మేము ఎవరినీ బ్లేమ్‌ చేయడం లేదు. ఇష్టం ఉండి సినిమా తీశాం, పోగొట్టుకున్నాం. ఈ వ్యాపారంలో ఎవరినీ నిందించలేము. గేమ్‌ ఛేంజర్‌ వల్ల వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగాదో. కానీ, చాలా మొత్తంలో నష్టపోయాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బయటపడ్డాం.  గేమ్‌ ఛేంజర్‌ నష్టాన్ని సుమారు 70 శాతం వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్‌ చేసింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌  ఉండేది కాదని చెబుతాను. మమ్మల్ని తిరిగి నిలబెట్టింది అనిల్‌ అని నేను నమ్ముతా.' అని శిరీష్‌ రెడ్డి అన్నారు.

Videos

బంగారంపై ఇప్పుడు పెట్టుబడి పడితే నష్టమా?

Nallapareddy Prasannakumar: ఇది నల్లపరెడ్డి బ్లడ్.. భయపడే ప్రసక్తే లేదు

తెలంగాణ లేకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం

చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం

CANADA: కేరళకు చెందిన స్టూడెంట్ పైలట్ శ్రీహరి సుకేశ్ మృతి

ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిపోయిన నీరు

మామిడి రైతులపై అచ్చెన్నాయుడు అబద్దాలు ఏకిపారేసిన పెద్ది రెడ్డి..

మా కార్యకర్తలపై చేయి వేస్తారా... వాసుపల్లి గణేష్ స్ట్రాంగ్ వార్నింగ్..

కూటమి సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ భీమిలి YSRCP సమన్వయకర్త

ఒక కేసు పెడితే మూడు కేసులు పెడతాం.. టీడీపీకి దిమ్మతిరిగే వార్నింగ్

Photos

+5

విష్ణువిశాల్- గుత్తా జ్వాలా కూతురి నామకరణ వేడుక (ఫోటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో అక్కినేనివారి కోడలు శోభిత (ఫోటోలు)

+5

కాశీలో యాంకర్ రష్మీ గౌతమ్ ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

ప్చ్‌.. బాహుబలినే వదులుకున్న స్టార్లు వీళ్లే (ఫోటోలు)

+5

టెన్త్‌ క్లాస్‌కే హీరోయిన్‌.. స్విమ్మింగ్‌ రాకపోయినా దూకేసింది (ఫోటోలు)

+5

పనికి రాదని చెప్పినా పట్టించుకోలేదు (చిత్రాలు)

+5

బంగారుపాళ్యంలో పారని పన్నాగం.. జగన్‌ కోసం మహా 'ప్రభం'జనం (చిత్రాలు)

+5

భక్తిధామం షిర్డీలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలు..!

+5

చీర కట్టులో జోష్‌ పెంచిన ఇస్మార్ట్‌ బ్యూటీ 'నభా నటేష్' (ఫోటోలు)

+5

వేడి వేడి కాఫీ...సైన్స్‌ ఏం చెబుతోంది? (ఫొటోలు)