AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
చలో డెహ్రాడూన్
Published on Fri, 06/06/2025 - 01:01
డెహ్రాడూన్ వెళ్తున్నారట చిరంజీవి అండ్ టీమ్. చిరంజీవి హీరోగా అనిల్ రాపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మరో హీరోయిన్ పాత్రలో కేథరిన్, ఓ కీలకమైన అతిథి పాత్రలో వెంకటేశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.
చిరంజీవితో పాటు ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ డెహ్రాడూన్, ముస్సోరి లొకేషన్స్లో జరుగుతుందని, అక్కడ ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు సాగుతుందట. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Tags : 1