కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు
ఫిర్యాదులపై స్పందిస్తాం
Published on Tue, 05/16/2023 - 06:12
జగిత్యాలక్రైం: గ్రీవెన్స్ సెల్ ద్వారా అందే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ భాస్కర్ అన్నారు. గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 మంది నుంచి దరఖాస్తులను నేరుగా స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సంబంధిత, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, గల్ఫ్ మోసాలపై ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యహరించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూ చించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ, అసాంఘిక శక్తులు, నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ భాస్కర్ సూచించారు.
రోడ్డెక్కిన రైతులు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ రైతులు సోమవారం ఉదయం జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెలరోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రూరల్ ఏఎస్సై శంకరయ్య తిప్పన్నపేటకు చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
బంద్ ప్రశాంతం
ధర్మపురి: జగిత్యాల రూరల్ ఎస్సై సస్పెండ్కు నిరసనగా విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, టీకొట్లు, టిఫిన్ సెంటర్లు, పాన్షాపులు, హోటళ్లు మూసిఉంచారు. సీఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్సై కిరణ్కుమార్ తన పోలీసు సిబ్బందితో బందోబస్తు చేపట్టారు.
కొడిమ్యాలలో..
మల్యాల(చొప్పదండి): ఎస్సై అనిల్ సస్పెన్షన్ను నిరసిస్తూ కొడిమ్యాలలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నాయకులు కోల అనిల్, గొల్కొండ రా జు, మంచాల భూమేశ్, అంకం మహేందర్, ఎ ర్రోజు శ్రీధర్, భైరి కార్తీక్, రవి, వాసు, మహేందర్, నిఖిల్, వికాస్, వేణు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణ
జగిత్యాల: బీసీ స్టడీసర్కిల్, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా సోమవారం తెలిపారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన జిల్లా యువతీయువకులు ఆన్లైన్ ద్వారా ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు, రిజిస్ట్రేషన్ల కోసం http://tsbcstudycircles. cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలట పేర్కొన్నారు. ఇతర వివరాలకు 0878–2268686, బీసీ స్టడీ సర్కిల్, కరీంనగర్లో సంప్రదించాలని సూచించారు.
పీహెచ్సీ తనిఖీ
కథలాపూర్(వేములవాడ): స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) బృందం సోమవారం త నిఖీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని విభాగాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేసింది. పీహెచ్సీ పనితీరు అంచనా వేసి కేంద్రప్రభుత్వానికి నివేదిక అందించనుంది. నివేదిక ఆధారంగా పీహెచ్సీకి ప్రత్యేకంగా నిధులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో ఎన్క్వాస్ అధికారులు మనో జ్ మిశ్రా, కార్డిలే వైశాలి దత్తాత్రయ, వైద్యశాఖ జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు శ్రీనివాస్, ఎండీ సమియొద్దీన్, స్థానిక వైద్యాధికారి సింధూజ, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Tags : 1