Breaking News

మధ్యవర్తిత్వంపై ఖతార్ కీలక వ్యాఖ్యలు

Published on Wed, 03/11/2026 - 10:56

దోహా: పశ్చిమాసియాలో రోజురోజుకు ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతంలోని దేశాలేవీ ఇరాన్‌కు శత్రువులు కావని, పరస్పర దాడుల వల్ల ఏ పక్షానికీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ తక్షణమే శత్రుత్వాన్ని వీడి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.

గత రెండు వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న తీవ్రస్థాయి బాంబు దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని తన పొరుగు దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడులతో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఇంధన సరఫరా వ్యవస్థ ఈ ఉద్రిక్తతల వల్ల అతలాకుతలమవుతోంది. పౌర నివాసాలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఖతార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అల్ జజీరాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఖతార్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-ఖులైఫీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిణామాలు అత్యంత దురదృష్టకరమని , ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కేవలం చర్చలతోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. తమ దేశ ప్రయోజనాలను, ప్రాంతీయ భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమపై దాడులు జరుగుతున్నప్పుడు మధ్యవర్తిత్వం వహించడం అసాధ్యమని ఇరాన్ గుర్తించాలని ఆయన సూచించారు.

ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనికి తక్షణ పరిష్కారం అవసరమని బిన్ అబ్దుల్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ దేశాలు ఇరాన్‌కు వ్యతిరేకం కాదన్న విషయాన్ని టెహ్రాన్ అర్థం చేసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికే ఖతార్ ప్రధాని మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ ఇరాన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, పొరుగు దేశాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో కూడా ఖతార్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. యుద్ధ వాతావరణాన్ని వీడి, శాంతి మార్గంలో పయనించాలని ఇరు పక్షాలకు ఖతార్ విజ్ఞప్తి చేస్తోంది. 

ఇది కూడా చదవండి: Switzerland: బస్సులో మంటలు.. ఆరుగురు సజీవ దహనం 

#

Tags : 1

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)