Breaking News

షాంఘై సదస్సు.. పాక్‌ ప్రధానికి మోదీ ఝలక్‌

Published on Mon, 09/01/2025 - 09:54

బీజింగ్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో ఉన్నారు. చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 25వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఎస్‌సీవో సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ 
ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తియాన్‌జిన్‌ వేదికగా జరుగుతున్న సదస్సుల్లో పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సైతం ఉన్నారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం పాక్‌ ప్రధానిని పట్టించుకోలేదు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను పలకరించలేదు. షాంఘై సదస్సులో భారత్‌, పాక్‌ ప్రధానులు ఎదురుపడినప్పటికీ మోదీ మాత్రం పలకరించలేదు. అయితే, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత మొదటిసారిగా మోదీ, షరీఫ్‌  ఎదురుపడ్డారు.

మరోవైపు.. ఇదే వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాత్రం ప్రధాని మోదీ ఎంతో ఆత్మీయతతో ఉ‍న్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకించారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అని రాసుకొచ్చారు. ఇక, జిన్‌పింగ్‌, పుతిన్‌తో మాట్లాడిన ఫొటోలను పోస్టు చేశారు. ఇదే సమయంలో తియాన్‌జిన్‌లో చర్చలు కొనసాగుతున్నాయి అని పేర్కొన్నారు.


మరోవైపు.. ఈ సదస్సు అనుబంధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ద్వైపాక్షికంగా సమావేశం కానున్నారు. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్‌పై ట్రంప్‌ అదనపు సుంకాలు, ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం వంటి పరిణామాల వేళ వీరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్‌ల అంశంపై వీరిద్దరూ చర్చించుకునే అవకాశం ఉంది.
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)