చైనా విషయంలో ట్రంప్‌ బాటలో బైడెన్‌

Published on Sat, 06/05/2021 - 12:59

వాషింగ్టన్‌: తమ దేశంలోని పెట్టుబడిదారులతో భాగస్వామ్యం ఉన్న చైనా కంపెనీలపై అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఆయా కంపెనీలకు చైనా సైన్యం, నిఘా సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తోంది. అందుకే తమ దేశంలో పెట్టుబడులు పెట్టే కొన్ని చైనా కంపెనీలపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో తాజాగా మరికొన్ని కంపెనీలను చేర్చింది. వ్యాపార, సాంకేతిక రంగాల్లో అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న కొన్ని చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ గతంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

మరికొన్ని కంపెనీలపైనా ఆంక్షలను అమల్లోకి తీసుకొస్తూ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ప్రభుత్వం ఆ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలని చైనా కోరింది. అమెరికాలో చైనా కంపెనీలకు సానుకూల పెట్టుబడి, వ్యాపార వాతావరణాన్ని కల్పించాలని తెలిపింది. తమ సంస్థలు, కంపెనీలపై ఎలాంటి వివక్ష చూపొద్దని కోరింది. చైనా కంపెనీల హక్కుల పరిరక్షిస్తామని తెలిపింది.
చదవండి: Facebook షాక్‌: ట్రంప్‌ కౌంటర్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ