Breaking News

అమెరికా ఎఫెక్ట్‌?.. ఇరాన్‌ చమురు నౌకలు సీజ్?

Published on Tue, 02/17/2026 - 09:25

ఇటీవల ఇండియన్ నేవీ అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసింది.  అయితే తాజాగా వాటికి సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ఆ నౌకలు ఇరాన్‌కు చెందినవని తెలుస్తోంది. అమెరికా వీటిని గతంలోనే నిషేదించిందని తెలుస్తోంది.

ఫిబ్రవరి 6న ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసినట్లు ఇండియన్ నేవీ అధికారులు ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ నౌకల పేర్లు స్టెల్లర్ రూబీ, అస్ఫల్ట్ స్టార్, అల్ జాఫ్జియాగా తెలిపారు. అనంతరం కొద్దిసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే తాజాగా ఆ నిషేదిత నౌకలకు ఇరాన్‌కు సంబంధించినవిగా మీడియా కథనాలు ప్రచురితమవుతున్నాయి.

వాషింగ్టన్ డీసీకి చెందిన పరిశోధనా సంస్థ ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) ప్రకారం, “ ఈ మూడు ఇరాన్‌ నౌకలను అమెరికా గతంలో నిషేధించింది.  ఈ నౌకలు యూఏఈకి చెందిన భారతీయ పౌరుడు జుగ్వీందర్ సింగ్ బ్రార్ 30-ట్యాంకర్ల నౌకాదళానికి చెందినవి. వీటిని సీజ్‌ చేసిన సమయంలో స్టెల్లార్ రూబీ నౌకపై  ఇరాన్ జెండా ఎగురుతుంది“ ఎఫ్‌డీడీ పేర్కొంది. 

అల్ జాఫ్జియా  నౌక 2025లో ఇరాన్ నుండి జిబౌటికి ఇంధన చమురును రవాణా చేసింది. ఆస్ఫాల్ట్ స్టార్ ఎక్కువగా చైనా చుట్టూ ప్రయాణాలపై నడిచిందని డేటాలో పేర్కొంది.అయితే ఇరాన్ ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. నేషనల్ ఆయిల్ కంపెనీ చర్యలను ఊటంకిస్తూ సీజ్ అయిన నౌకలకు ఆ కంపెనీతో సంబంధం లేదని తెలిపింది. అయితే గతంలో ఈ నౌకలు స్వాధీనం చేసుకున్న తర్వాత భారత నేవికా దళం భద్రతను మరింతగా పెంచింది.

అయితే ప్రస్తుతం అమెరికా భారత్ మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఇటీవల భారత్‌పై విధించిన అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధానితో ఫోన్‌లోనూ చర్చించారు. దీనికి మోదీ సైతం ధన్యవాదాలు తెలిపారు. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)