Breaking News

ఇరాన్‌ యుద్ధం.. ముడిచమురు మంట

Published on Sun, 03/08/2026 - 05:13

(సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి)  :  పశ్చిమాసియా సంక్షోభంతో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేయ­­టం.. ఇరాన్‌ ప్రతిదాడులకు దిగటంతో పాటు గల్ఫ్‌­లోని అమెరికా రక్షణ స్థావరాలన్నిటిపైనా గురిపెట్టడంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రపంచ చమురు సరఫరాకు నాడీ వ్యవస్థలాంటి హోర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్‌ ఆంక్షలు విధించటంతో చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. 

ఇంధన అవసరాలపై భయాందోళనలతో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నా­యి. ఈ నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ క్షిపణుల దాడి ఆర­ంభించే నాటికి బ్యారెల్‌ ముడిచమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా.. వారం తిరిగేసరికి శుక్రవారం ఏకంగా 92.69 డాలర్లకు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే లండన్‌ మా­ర్కె­ట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఏకంగా 13 శాతం పెరగటం గమనార్హం. ఈ ధోరణి కొనసాగితే ధర మరింత పెరిగి తక్ష­ణం 100 డాలర్లు దాటేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

దిగుమతులపై భారం... 
భారత్‌కు అవసరమైన చమురులో 85–88 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. కాబట్టి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతుంది. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత్‌ ముడి చమురు దిగు­మతుల కోసం 137 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

ఈ ఏడా­ది తొలి పది నెలల్లో 206.3 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ కోసం 100.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. ధరలు పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరగటంతో పాటు ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. యుద్ధం సుదీర్ఘ కా­లం కొనసాగితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ధరలు పెరిగి ఆయా రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చు. రవాణాపై ప్రభావం పడితే అది అన్ని వస్తువులకూ వ్యాపిస్తుంది.

దేశీయంగా పలు చర్యలు...
ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి భారత్‌ ఇప్పటికేపలు చర్యలు తీసుకుంటోంది.  వ్యూహాత్మకంగా చమురు నిల్వలను పెంచుకోవటంతో పాటు పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని విస్తరించటం.... ప్రత్యామ్నాయ దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవటం వంటివి ఇప్పటికే చేస్తోంది.  

ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద ఆదేశాలు జారీ చేస్తూ... ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని, పెట్రోకెమికల్స్‌ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్‌ ఉపయోగించడానికి వీల్లేదని, వాటితో కేవలం ఎల్పీజీనే ఉత్పత్తి చేయాలని స్పష్టంచేసింది. 

మన దగ్గర 6-8 వారాల డిమాండ్‌కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు­న్నాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటికితోడు దేశీ­యంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్‌ నిల్వలూ ఉన్నాయని, సంక్షోభం ఎక్కువకాలం కొన­సాగితే సరిపడేంత ఆయిల్‌ను అమెరికా, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని వెల్లడించింది.  

ధరలు పెరిగిందిలా...
ఫిబ్రవరి 28  71 డాలర్లు 
మార్చి 7 92.69 డాలర్లు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)