Breaking News

పిల్లల్లో ఉబకాయం.. బ్రిటన్ అధికారుల కీలక నిర్ణయం..!

Published on Tue, 01/06/2026 - 01:31

బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో పెరుగుతున్న ఉబకాయాన్ని అరికట్టేందుకు నడుం బిగించింది. బాల్యంలో ఉబకాయం రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కఠిన నియమాన్ని అమల్లోకి తెచ్చింది. రాత్రి 9 గంటల వరకు టీవీ, ఆన్‌లైన్‌లో జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ రూల్‌తో పిల్లలను ఉబకాయం నుంచి బయటపడేలా దోహదం చేస్తుందని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం నుంచే ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.

తక్కువ పోషకాహార ఆహారాలు, చక్కెర పానీయాల ప్రకటనలను నిషేధించడం వల్ల ప్రతి సంవత్సరం పిల్లల ఆహారంలో సుమారు 7.2 బిలియన్ కేలరీలు తగ్గుతాయని ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం (DHSC) తెలిపింది. దీని వలన ఊబకాయం బారిన పడే పిల్లల సంఖ్య సుమారు 20 వేల వరకు తగ్గుతుందని అభిప్రాయపడింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రభుత్వ జాతీయ ఆరోగ్య సేవ (NHS)కు సుమారు 2 బిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.

రాత్రి 9 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలను పరిమితం చేయడం, ఆన్‌లైన్‌లో చెల్లింపు ప్రకటనలను నిషేధించడం వల్ల పిల్లలు, తల్లిదండ్రులను అనారోగ్యకరమైన ఆహారం నుంచి రక్షించవచ్చని భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరింత సులభతరం అవుతుందని యూకే ఆరోగ్య మంత్రి ఆష్లే డాల్టన్ అన్నారు. వ్యాధులకు చికిత్స చేయడం కంటే.. వాటిని నివారించడంపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారని తెలిపారు. జంక్‌ఫుడ్ ప్రకటనలు పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు.

జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల చిన్న వయస్సులోనే ఊబకాయంతో పాటు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశముందని బ్రిటన్ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్‌లో 22.1 శాతం మంది పిల్లలు ప్రాథమిక పాఠశాల నుంచే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. భవిష్యత్తులో  ఈ సంఖ్య 35.8 శాతానికి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆసుపత్రిలో చేరడానికి దంత క్షయం ప్రధాన కారణమని అన్నారు. తాజాగా విధించిన ఆంక్షలు పిల్లలను అత్యంత హానికరమైన ప్రకటనల నుంచి రక్షించడంలో సహాయపడతాయని ఒబేసిటీ హెల్త్ అలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ జెన్నర్ అన్నారు.

ఇప్పటివరకు ఆరోగ్యకరమైన తరాన్ని సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని.. ఈ విధానం ఊబకాయం సంబంధిత వ్యాధులను నివారించడానికి విస్తృత ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన భాగమని ఆమె అన్నారు. ఇది మరింత ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో నిబంధనలు బలోపేతం చేయడం చాలా అవసరమని తెలిపారు.

 

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)