Breaking News

Afghan earthquake: జీవచ్ఛవాలు

Published on Fri, 06/24/2022 - 04:25

గయాన్‌ (అఫ్గానిస్తాన్‌): అఫ్గానిస్తాన్‌ను కుదిపేసిన పెను భూకంపం భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లు నేలమట్టమయ్యాయి. వ్యవప్రయాసల కోర్చి  సహాయ చర్యల కోసం వెళ్లిన సిబ్బంది కొండల్లో మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పడి ఉండటం చూసి కంటతడి పెడుతున్నారు. వాటిని వెలికి తీయడం తప్ప చేయడానికి అక్కడేమీ లేదని సహాయ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు. బుధవారం నాటి భూకంపంలో వెయ్యి మంది దుర్మరణం పాలవడం తెలిసిందే.

పక్తిక ప్రావిన్స్‌లోని గయాన్, బర్మల్‌ జిల్లాల్లో అత్యధికంగా విధ్వంసం జరిగింది. అక్కడి ఊళ్లన్నీ శిథిలాల దిబ్బలుగా మిగిలాయి. ప్రాణాలతో బయట పడ్డవారు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. జీవచ్ఛవాలుగా మారారు. అయిన వారి కోసం వారు ఏడుస్తూ వెదుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భారీ వర్షం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఉత్తర వజరిస్తాన్‌ నుంచి అఫ్గాన్‌కు వెళ్లిన 30 మంది పాకిస్తానీలు భూకంపానికి బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.

చేతులే ఆయుధాలుగా
గ్రామాలన్నీ నేలమట్టం కావడంతో శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో చూసేందుకు గ్రామస్తులు చేతులనే ఆయుధాలుగా మార్చుకున్నారు. గుట్టలుగా పడున్న రాళ్లు, రప్పలను చేతులతో తొలగిస్తున్నారు. తలదాచుకోవడానికి తమకు కనీసం టెంట్‌ కూడా లేదని వాళ్లు వాపోతున్నారు. పరిసర ఊళ్ల వాళ్లు తప్ప ప్రభుత్వం నుంచి ఎవరూ సాయానికి రావడం లేదని చెబుతున్నారు. తిండికి కూడా లేక వారంతా అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మరణించిన తమవారి ఆత్మశాంతి కోసం బాధితులు చేస్తున్న ప్రార్థనలే వినిపిస్తున్నాయని కవరేజీకి వెళ్లిన బీబీసీ జర్నలిస్టు చెప్పారు. సహాయ చర్యలకు రంగంలోకి దిగినట్టు యునిసెఫ్‌ చెప్పింది.

మృతుల్లో చిన్నారులే అధికం
భూకంపంలో పిల్లలు, యువతే అత్యధికంగా బలైనట్టు వైద్య సిబ్బంది వెల్లడించారు. రెండు హెలికాఫ్టర్లలో పక్తిక ప్రావిన్స్‌కు వెళ్లిన వైద్యులకు ఎటు చూసినా పిల్లలు, యువత శవాలే కనిపిస్తున్నాయి. భూకంప తీవ్రతకు సెల్‌ టవర్లు కూడా కూలి కమ్యూనికేషన్లు తెగిపోవడంతో సమాచారం తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది. ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో కొద్ది రోజులైతే తప్ప తేలేలా లేదు.

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)