Breaking News

ఘనంగా 'తెలంగాణ కథలు'ను ప్రారంభించిన ఓనమాలు..!

Published on Mon, 06/02/2025 - 13:53

ప్రాంతీయ పాక వారసత్వం, సాంస్కృతిక వారసత్వాన్ని  ఉత్సవంగా జరుపుకోవాలనే  ఆశయంతో తెలంగాణ కథలు’ను ఘనంగా ప్రారంభించింది ’ఓనమాలు‘. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)కి   సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం,  తెలంగాణ ప్రాంత వంటకాలు, కళలు, కథలను పండుగలా నిర్వహించింది. చిత్రనిర్మాతలు, కవులు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు , ఆహార ప్రియులను ఒకచోటకు చేర్చి, వారికి  అద్భుతమైన అనుభవాన్ని అందించింది అనడంలో సందేహం లేదు.

ఈ వేడుకలో కరీంనగర్ మహిళలు తయారుచేసిన సర్వపిండి, బక్షాలు, జొన్న రొట్టె, కామారెడ్డి నుంచి మక్క పేలాలు, వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు స్థానికంగా లభించే పండ్లు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి గోండులు, మహువా సమాజానికిచెందిన  గుస్సాడి నృత్యం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఈ  వేడుకకు ఉత్సాహభరితమైన  ప్రాంతీయ సౌరభాలను సమరకూర్చాయి. 

“తెలుగును ఒకమాటలో వర్ణించలేం.  ఒకే ఒక్క సాధారణ స్వరంలో చెప్పలేం. ఇది  వెయ్యి సూక్ష్మ కథలతో, అనేక ఉప-ప్రాంతీయ వైవిధ్యాలతో  జమిలిగా అల్లిన  కథ.  దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి,  వినడానికి, కనుమరుగవుతున్న వాటిని సంరక్షించడానికి మేము ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, హైదరాబాద్ కోసం సూక్ష్మ-ప్రాంతీయ సంఘాలను నిర్మిస్తున్నాము, ”అని ది క్యులినరీ లాంజ్ CEO , ఓనమాలు ఉద్యమంలో కీలక  సూత్రధారి గోపి బైలుప్పల అన్నారు. “ఈసారి, ప్రయాణం ఎప్పుడూ లేనంతగా ఇంటికి దగ్గరగా ఉంది.” అని పేర్కొన్నారు.

ఈ ప్రాంతీయ సంఘాలు నెలవారీ మాస్టర్‌క్లాస్‌లు, సాంస్కృతిక చర్చలను నిర్వహిస్తాయి, ఔత్సాహికులకు స్థానిక ఆహారం, సాహిత్యం, సంప్రదాయాలను అన్వేషించడానికి ఒక వేదికను అందిస్తాయన్నారు. ఈ దృష్టి కేంద్రీకృత సమాజ కార్యక్రమాల శ్రేణిలో తెలంగాణ కథలు మొదటి అధ్యాయం. ఈ కార్యక్రమంలో అన్విక్షికి పబ్లిషర్స్ వ్యవస్థాపకుడు వెంకట్ సిద్ధా రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఆయన పాక పునరుజ్జీవనం, సాహిత్య పునరుజ్జీవనం మధ్య  ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు “అన్విక్షికి తెలుగు సాహిత్యాన్ని పునరుద్ధరించే దృక్పథంతో స్థాపించారు. స్థానిక వ్యాపారాలలో చిన్న స్వయం-సేవ పుస్తక దుకాణాలు, చలనచిత్ర నిర్మాణ కార్యాలయాలలో లైబ్రరీల ద్వారా తాము తమ పరిధిని విస్తరిస్తున్నామని  వెంకట్ తెలిపారు. ఈ చొరవ పాఠకుల సంఖ్యను, ఆదాయాన్ని అందిస్తూనే ఆయా ప్రదేశాలకు సాంస్కృతిక విలువను జోడిస్తుందని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న  చిత్రం ’బలగం‘తో  అవార్డు గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి,  మరో అవార్డు గ్రహీత, తెలుగు రచయిత పెద్దింటి అశోక్ కుమార్  పాల్గొన్నారు.   ఈ సందర్భంగా వారు ది క్యులినరీ లాంజ్‌లో అన్విక్షికి  ప్రత్యేక పుస్తకాల  షెల్ఫ్‌ను  ప్రారంభించారు.

ప్రముఖ విద్యావేత్త, నటీ గీతా భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ అమర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ వంటలను ఆస్వాదించి, నిర్వహకులను అభినందించారు.

బలగం డైరెక్టర్ వేణు మాట్లాడుతూ సర్వపిండి, బక్షాలను గురించి ఈతరం పిల్లలకు తెలియదనీ, భవిష్యత్ తరానికి తెలంగాణ పురాతన వంటకాల గురించి తెలియజేయడానికి ఓనమాలు చేస్తున్న ప్రయత్నం గొప్పదనీ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

ఓనమాలు గురించి
తెలుగు మాట్లాడే రాష్ట్రాలలోని వైవిధ్యమైన పాక వారసత్వాన్ని సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, వాటిని ముందుతరాలకు అందించే లక్ష్యంతో 2024లో లాంచ్ అయింది ’ఓనమాలు‘ అనే కమ్యూనిటీ ఇనీషియేటివ్. సూక్ష్మ వంటకాలను అన్వేషించడం, పురాతన వంటకాలను పునరుద్ధరించడం, పరిశోధన, వాటి గురించి సవివరంగా చెప్పడం, ఆచరణాత్మక అనుభవాల ద్వారా కమ్యూనిటీలను నిమగ్నం చేయడమే ఓనమాలు లక్ష్యం. 

డాక్టర్ ఎ.వి. గురవా రెడ్డి KIMS-SUNSHINE హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ (ITEC), పరిశ్రమలు అండ్‌ వాణిజ్య విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణలో సీనియర్ IAS అధికారి జయేష్ రంజన్ ’ఓనమాలు‘ను  ప్రారంభించారు. గత సంవత్సరంలో ఓనమాలు 27,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, పెద్దలు, రైతులు, గృహ వంటవారు. ఇతర నిపుణులను కలిసి, కనుమరుగవుతున్న రుచులను, మరచిపోయిన పాక పద్ధతులను తిరిగి గుర్తించారు. 

ఈ వేదిక ఫ్లూట్ రిసిటల్స్, పాక థియేటర్ ప్రదర్శనలు, సాంప్రదాయ రుచికరమైన వంటకాలను అందించే లైవ్ ఫుడ్ స్టేషన్‌ల నిర్వహణతో రుచి, సంప్రదాయం ద్వారా తరాల అంతరాలను తగ్గిస్తోంది. తెలుగు పాక పరి జ్ఞానాన్ని సంరక్షించి, గర్వంగా  అందించేలా వంట మ్యూజియంను స్థాపించడం, ట్రైనింగ్  వర్క్‌షాప్‌లను నిర్వహించడంతోపాటు,  గృహిణులు, చెఫ్‌లు, ఆహార చరిత్రకారులు, సాంస్కృతిక నిపుణులతో సహకారాన్ని పెంపొందించడం  అనేవి ఓనమాలు భవిష్యత్ ప్రణాళికలు.

(చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్‌ అంకితభావానికి మాటల్లేవ్‌ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..)

Videos

అల్లుడు, కూతురుపై ముద్రగడ కీలక వ్యాఖ్యలు

పక్కా ప్లాన్ తో భర్తను హత్య చేసిన భార్య

వేల కోట్ల బిజినెస్ కాదని.. అఖిల్ భార్య చేసే పనేంటో తెలుసా..?

సారీ చెప్పినా.. వినరా.. జరిగేది జరుగుద్ది.. తెగేసి చెప్పిన KSR

లోకేష్ చెప్పినట్టే చేసి.. షాక్ ఇచ్చిన పబ్లిక్

చేప ప్రసాదం వేయించుకున్న VH.. ఎట్లా ఏసుకుండో చూద్దామా?

తిరుమలలో మరో అపచారం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పురోగతి

పవన్ అడ్డాలో అరాచకాలు.. ఆధారాలతో బయటపెట్టిన వర్మ

ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం! అందుకే ఓడిపోయాం..

Photos

+5

యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం (ఫొటోలు)

+5

ఎంపీతో క్రికెటర్‌ రింకూ సింగ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం: : మంత్రి లోకేష్‌ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు)

+5

మిస్‌ యూనివర్స్‌ 2025 పోటీలకు మన తెలుగు తేజాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా అఖిల్‌- జైనాబ్ రిసెప్షన్‌ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి వరలక్ష్మీ దంపతులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : చేప మందు పంపిణీ.. పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మాగంటికి నేతలు కన్నీటి నివాళి (ఫొటోలు)

+5

అఖిల్‌ అక్కినేని సతీమణి 'జైనబ్‌' ఫోటోషూట్‌ లుక్స్‌ చూశారా..? (ఫొటోలు)

+5

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ వేడుక (ఫొటోలు)