Breaking News

‘లోన్‌ యాప్‌’ కేసులో మరో ముగ్గురి అరెస్ట్‌

Published on Mon, 09/26/2022 - 06:20

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో లోన్‌ యాప్‌ వేధింపులు భరించలేక దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసులు గుజరాత్‌కు చెందిన ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు.

లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో బాధిత కుటుంబంలోని చిన్నారులకు రూ.10 లక్షల సాయాన్ని అధికార యంత్రాంగం ద్వారా అందజేశారు.

లోన్‌ యాప్‌ కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన హ్యాండీ లోన్, స్పీడ్‌ లోన్‌ యాప్‌ సహాయకులుగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పలు ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.

గుజరాత్‌లోని షెల్‌ కంపెనీ యజమానులుగా ఉన్న అదే రాష్ట్రంలోని సబర్కత జిల్లా లిల్పూర్‌ ప్రాంతానికి చెందిన పటేల్‌ నితిన్‌కుమార్‌ రమేష్‌భాయి(19), గాంధీనగర్‌లోని ముఖిన్‌పథ్‌కు చెందిన పటేల్‌ మిలన్‌కుమార్‌ రాజేష్‌భాయి (26), రాభారి విధాన్‌ (26)తో పాటు ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు.

అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వీరితోపాటు కొద్ది రోజుల కిందట తెలంగాణలోని బండారిగూడేనికి చెందిన గోవింద్‌ రాజేంద్రప్రసాద్‌ను కూడా పోలీసులు హైదరాబాద్‌లో పట్టుకున్నారు. దీంతో లోన్‌ యాప్‌ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్‌ చేశారు. కేవలం 20 రోజుల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. మీడియా సమావేశంలో అడిషనల్‌ ఎస్పీలు ఎం.రజని, జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)