Breaking News

వరుస చోరీలు.. జనం బెంబేలు

Published on Mon, 05/23/2022 - 23:33

లక్కిరెడ్డిపల్లె : లక్కిరెడ్డిపల్లెలో గత ఆరు నెలల నుంచి వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అర్థరాత్రి 1 గంట సమయంలో రాజ్‌ మెడికల్‌ షాపులో రూ.3వేలు, సెల్‌పాయింట్‌లో ఫోన్లకు సంబంధించిన సామగ్రి దొంగిలించినట్లు బాధితులు ఫరీద్‌ బాబా, కరీం ఆదివారం తెలిపారు. రాజ్‌ మెడికల్‌ షాప్‌లో సీసీ కెమెరాలు అమర్చినా దొంగలు తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి తమ వద్ద ఉన్న సెల్‌ లైటింగ్‌తో డబ్బులు తీసుకొని బయటికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

ఈ మేరకు బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా గత ఏడాది నవంబర్‌లో దర్బార్‌బాషా మెడికల్‌ షాపులో రూ.1.73లక్షలు నగదు దొంగలు అపహరించుకుపోయారు. తరువాత రెండోసారి జనవరిలో రూ.16వేలు అపహరించారని దర్బార్‌ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనల్లో ఇంతవరకు దొంగల ఆచూకీ లేదు.

ఇంతలోనే శనివారం అర్థరాత్రి మరో మారు దొంగలు లక్కిరెడ్డిపల్లె–రామాపురం రోడ్డులో ఉన్న మెడికల్‌ షాపు, సెల్‌పాయింట్‌లో చోరీకి పాల్పడటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు దొంగతనం కేసులను ఛేదించాలని ప్రజలు కోరుతున్నారు.

మంగంపేట పునరావాసకాలనీలో..
ఓబులవారిపల్లె : మంగంపేట పునరావాస కాలనీలో శనివారం రాత్రి గౌనూతల శ్రీనవాసులు ఇంట్లో చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తన కుమార్తె అనారోగ్యం కారణంగా శనివారం బాధితుడు కడపకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులకొట్టి బంగారు నగలు, వెండి దొంగిలించారు.

ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఇంటిలోనే వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. శ్రీనివాసులు, ఆయన భార్య సుబ్బరత్నలు పరిశీలించగా రూ. 45 వేలు నగదు, విలువైన బంగారం చోరి అయినట్లు గుర్తించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)