Breaking News

కనపర్రులో టీడీపీ నేతల దౌర్జన్యం

Published on Sun, 09/04/2022 - 04:26

నాదెండ్ల: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. మహానేత వైఎస్సార్‌ వర్థంతిని అడ్డుకునేందుకు కుటిలయత్నం చేసి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైకి కారును వేగంగా దూకించారు. కనపర్రు గ్రామంలో శుక్రవారం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని భారీ అన్నదానం చేపట్టారు.

మహానేత విగ్రహానికి సాయంత్రం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు నాతాని సురేష్, నాతాని ఆంజనేయులు, నాతాని మనోహర్‌లతోపాటు రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత కుమారుడు రమేష్, కావూరు గ్రామానికి చెందిన కందుల శివప్రసాద్‌ గ్రామంలోని టీడీపీ నాయకుని నివాసంలో పూటుగా మద్యం సేవించారు.

ఆ తర్వాత తమ కారుకు టీడీపీ జెండా కట్టుకుని ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తూ నానా హంగామా సృష్టించారు. ర్యాలీగా వస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను అటకాయించేందుకు తమ కారును అడ్డుగా నిలిపారు. కారును తొలగించాలని గ్రామ సర్పంచ్‌ పెరుమాళ్లపల్లి వెంకటేశ్వర్లు కోరారు. దీంతో వారు కారును వేగంగా కార్యకర్తలపై దూకించారు.

దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కుంచాల శివశంకర్, మానసిక వికలాంగులైన చెవుల అనిల్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. అన్నలదాసు ప్రసాద్, వేముల బాలరాజు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)