Breaking News

నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని.. చివరికి భర్త షాకింగ్‌ నిర్ణయం

Published on Thu, 11/17/2022 - 20:05

భవానీపురం(విజయవాడ పశ్చిమ): భార్య తన మాట వినటం లేదని మనస్తాపం చెందిన భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెం దుర్గమ్మ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట ప్రకాష్‌నగర్‌లో తన కుమార్తె దగ్గర ఉంటుంది. మార్బుల్‌ పని చేస్తూ జీవనం సాగించే ఆమె పెద్ద కుమారుడు కల్లెం లక్ష్మీప్రసాద్‌ (37)కి వివాహమయ్యి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

అయితే లక్ష్మీప్రసాద్‌ ఎనిమిదేళ్ల క్రితం మొదటి భార్యను వదిలేసి భవానీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని చిట్టినగర్‌ సాయిరాం సెంటర్‌ నాగమ్మ సత్రం ఎదురుగా ఉన్న అద్దాలవారి వీధిలో కొండపై ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో లక్ష్మీప్రసాద్‌ తల్లి దుర్గమ్మకు ఫోన్‌ చేసి తన రెండో భార్య భవానీ తన మాట వినటం లేదని, తాను వద్దంటున్నా పనికి వెళుతోందని చెప్పి బాధపడ్డాడు.

ఆ సమయంలో అతను మద్యం సేవించి మాట్లాడినట్లు తల్లి భావించింది. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో భవానీ అత్త దుర్గమ్మకు ఫోన్‌ చేసి లక్ష్మీప్రసాద్‌ ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని చెప్పింది. దీంతో దుర్గమ్మ వెంటనే లక్ష్మీప్రసాద్‌ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా ముందు గది అయిన బెడ్‌ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు.

చూడాలని ఉందన్నాడు.. 
కోడలు భవానీని ఏం జరిగిందని అత్త అడుగగా ఉదయం 9.30 గంటలకు తాను పనిచేసే చోట దింపి ఇంటికి వెళ్లిపోతానని భర్త చెప్పాడని, మధ్యాహ్నం 12.45 గంటలకు ఫోన్‌ చేసి నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అన్నాడని తెలిపింది. అయితే పనిలో ఉండగా ఫోన్‌ మాట్లాడితే ఓనర్‌ ఊరుకోడని, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని ఫోన్‌ పెట్టేశానని అత్త దుర్గమ్మకు చెప్పింది.

తిరిగి ఒంటి గంట సమయంలో పని నుంచి బయటకు వచ్చి భర్తకు ఫోన్‌ చేయగా ఫోన్‌ ఎత్తకపోవడంతో తమ ఇంటి పక్కనే నివసించే గంగ అనే మహిళకు ఫోన్‌ చేసి తన భర్త ఫోన్‌ ఎత్తడం లేదని ఒక సారి వెళ్లి చూడమని కోరానని తెలిపింది. ఆమె వెళ్లి చూడగా బెడ్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని చనిపోయి ఉన్నాడని చెప్పింది. భార్య తన మాట వినడం లేదని తాగిన మత్తులో క్షణికావేశంతో ఉరేసుకుని చనిపోయి ఉంటాడని భావిస్తున్నానని మృతుడి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్‌....నివ్వెరపోయిన పోలీసులు   

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)