Breaking News

ఇద్దరి పిల్లల తల్లి.. ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు..

Published on Sun, 08/21/2022 - 20:14

పెందుర్తి(విశాఖపట్నం): రైలు కింద పడి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టపడిన యువకుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా సదరు యువకుడు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జీఆర్పీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపట్నం సమీపంలోని కొత్తపాలేనికి చెందిన కొణతాల హేమలత(25) భర్తతో విభేదాల కారణంగా రెండేళ్ల క్రితం విడిపోయింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని పుట్టింటిలో ఉంటుంది. ఆమె బ్యూటీషియన్‌ కోర్సు చేసింది. శుభకార్యాలకు, ఇతరత్రా కార్యక్రమాలకు మేకప్‌లు వేసేందుకు బయటకు వెళ్తుంది.
చదవండి: హనీ ట్రాప్‌.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసి.. 

ఈ నేపథ్యంలో కోటనరవకు చెందిన ఆటో డ్రైవర్‌ కె.కుమార్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అమ్మగారి ఇంటి నుంచి హేమలత బయటకు వెళ్లి కుమార్‌ను కలిసింది. ఇద్దరూ కలిసి సతివానిపాలెం రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లి  రాత్రి అంతా గడిపారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం (ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు) తీసుకున్నారు.

ఇద్దరూ కలిసి ట్రాక్‌పై పడుకున్నారు. అయితే రైలు రావడం ఆలస్యం కావడంతో ఇద్దరూ సమీపంలోని బడ్డీ వద్దకు వచ్చి కాసేపు గడిపారు. మళ్లీ కాసేపటి తర్వాత ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆఖరి క్షణంలో మనసు మార్చుకున్న కుమార్‌ ఆ ప్రయత్నం విరమించుకుందామని హేమలతను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు. కానీ హేమలత ససేమిరా అని రైలుకు ఎదురుగా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరికీ పెనుగులాట జరిగింది. రైలు వేగంగా రావడంతో ట్రాక్‌ మీద ఉన్న హేమలతను బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో కుమార్‌ పక్కకి ఉండడంతో రైలు వేగానికి తుళ్లి రాళ్లపై పడిపోయాడని జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు.  

గార్డు చూడడంతో వెలుగులోకి.. 
ఘటన జరిగిన ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో ఈ ఘటన శనివారం ఉదయం వరకు ఎవరికీ తెలియలేదు. అయితే బహిర్భూమికి అటుగా వెళ్లిన అక్కడి ప్రైవేటు కంపెనీ గార్డు అప్పలరాజు గాయాలతో మూలుగుతున్న కుమార్‌ను చూశాడు. వెంటనే సమీపంలోని రోడ్డు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి బైకిస్ట్‌ జగదీష్‌ను ఆపి ఘటనాస్థలికి తీసుకెళ్లాడు. వెంటనే 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం కుమార్‌ను కేజీహెచ్‌కు తరలించారు.

సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు పాల్పడాల్సిన కారణం ఏంటన్నది కుమార్‌ కోలుకున్నాకే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ దిశగా జీఆర్పీ సీఐ కె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ బాలాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు హేమలతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.   

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)