Breaking News

సామాన్యుడిపై ధరల భారం తప్పదా?

Published on Tue, 04/14/2026 - 18:02

పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర ఇటీవలే 110 డాలర్ల మార్కును తాకడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే రాష్ట్ర ఎన్నికల అనంతరం సామాన్యుడిపై ఇంధన ధరల భారం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కంపెనీల నెత్తిన నష్టాల భారం

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్‌), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రిటైల్ ధరలను సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడం, విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.18, డీజిల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.35గా ఉందని అంచనా. ఓఎంసీలకు ఒక దశలో రోజుకు రూ.2,400 కోట్లుగా ఉన్న ఈ నష్టం ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.1,600 కోట్లకు చేరింది.

మాక్వారీ నివేదిక విశ్లేషణ

ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ (Macquarie) తాజా నివేదిక ప్రకారం, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన స్వల్ప లాభాలను మార్చి నెల నష్టాలు తుడిచిపెట్టేశాయి. ‘అంతర్జాతీయంగా స్పాట్ ధరలు బ్యారెల్‌కు 135 - 165 డాలర్ల మధ్య ఉన్న తరుణంలో భారత్‌లో విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీలు భారీ నష్టాలను ప్రకటించే అవకాశం ఉంది’ అని తెలిపింది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.

దిగుమతులపై ఆధారపడటం ఒక సవాల్

భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది (2025 గణాంకాల ప్రకారం). మధ్యప్రాచ్యం, రష్యా, అమెరికాల నుంచి మనం చమురును సేకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే, దేశీయంగా లీటరుపై రూ.6 నష్టం అదనంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాగించాలంటే బ్యారెల్ ధర 80-85 డాలర్ల మధ్య ఉండాలి, కానీ ఇప్పుడు అది 120 డాలర్ల వద్ద ఉండటం ఆందోళనకరం.

అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గని పక్షంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చమురు ధరల పెంపు అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేసే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Videos

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి

మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..

సీఎం రేసులో కీలక నేతలు

ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్

చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

Photos

+5

సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్స్ (ఫోటోలు)

+5

తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)

+5

రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)