Breaking News

కేంద్రం కొత్త రూల్స్‌.. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్‌ కాల్స్‌ నిబంధనలు!

Published on Fri, 04/28/2023 - 15:09

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు శుభవార్త చెప్పింది. మే నెల ప్రారంభం నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో యూజర్లకు భారీ ఊరట లభించినట్లైంది. 

ట్రాయ్‌ ప్రకటనతో ఫోన్‌ వినియోగదారులు ఫేక్‌, ప్రమోషనల్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల బారి నుంచి ఉపశమనం పొందనున్నారు. ఇందుకోసం ట్రాయ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయం తీసుకోనుంది. తద్వారా యూజర్లను అస్తమానం చికాకు పెట్టించే కాల్స్‌, మెసేజ్‌ల బెడద తప్పనుంది.  

టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు 
ఇక స్పామ్‌ కాల్స్‌ బెడద నుంచి యూజర్లను రక్షించేలా టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్‌ టెల్‌, జియో, వివో వంటి సంస్థలు తప్పనిసరిగా ఏఐ ఫిల్టర్‌ను వినియోగించాలని ఆదేశించింది. దీని ద్వారా, ఫోన్‌లలోని ప్రమోషనల్‌ కాల్స్‌ ఫేక్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల నుంచి బయటపడొచ్చు.  

ట్రాయ్‌ ఆదేశాలు.. ఎయిర్‌టెల్‌ , జియో అప్రమత్తం
​ఈ తరుణంలో ట్రాయ్‌ ఆదేశాలపై జియో, ఎయిర్‌టెల్‌ స్పందించాయి. ట్రాయ్‌ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే తమ నెట్‌వర్క్‌లలో ఏఐ ఫిల్టర్‌ ఆప్షన్‌ను ఏనేబుల్‌ చేస్తామని తెలిపాయి. ఇక,ఈ ఆప్షన్‌ మే 1 నుంచి వినియోగించుకునే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

కాల్‌ ఐడీ ఉపయోగం ఏంటంటే?
టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవగాహనా రాహిత్యం వల్ల స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌ల వల్ల అనార్ధాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాయ్‌ గత కొంతకాలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సైబర్‌ నేరస్తులు ఫేక్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో అమాయకుల బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా సైబర్‌ మోసాలపై దృష్టి సారించిన ట్రాయ్‌.. టెలికాం కంపెనీలకు కాల్‌ ఐడీని అందుబాటులోకి తెచ్చేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కాల్‌ ఐడీ ఆప్షన్‌తో మనకు ఫోన్‌ చేసే వారి పేర్లు, ఫోటోలు మొబైల్‌ ఫోన్‌లపై డిస్‌ప్లే కానున్నాయి. ఇలా చేయడం వల్ల మనకు ఫోన్‌ చేసేది ఎవరనేది ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడొచ్చని రెగ్యులేటరీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.  

ససేమీరా అంటున్న టెలికాం కంపెనీలు
కానీ, ప్రైవసీ సమస్య కారణంగా ఎయిర్‌టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీని తీసుకురావడానికి వెనుకాడుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లను అరికట్టడానికి ఏఐ ఫిల్టర్ మాత్రమే మే 1 నుండి అమల్లోకి రానుందనేది వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.  

చదవండి👉 వైరల్‌ అవుతున్న లలిత్‌ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే?

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)